దేవిశ్రీ..వ‌రుస‌గా మూడు నెల‌లు

  • IndiaGlitz, [Monday,October 16 2017]

ఖైదీ నెం.150, నేను లోక‌ల్‌, రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, జ‌య‌జాన‌కి నాయ‌క, జై ల‌వ‌కుశ‌.. ఇలా ఈ ఏడాదిలో ఇప్ప‌టికే ఆరు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో సంద‌డి చేశాడు యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌. ఈ నెల 27న ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ అంటూ మ‌రో చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు దేవిశ్రీ‌. విశేష‌మేమిటంటే.. ఆగ‌స్టు నెల నుంచి గ‌మ‌నిస్తే.. వ‌రుస‌గా మూడు నెల‌ల‌పాటు దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఆగ‌స్టులో జ‌య‌జాన‌కి నాయ‌క ప్రేక్ష‌కుల ముందుకి వ‌స్తే.. సెప్టెంబ‌ర్‌లో జైల‌వ‌కుశ తెర‌పైకి వ‌చ్చింది. ఇక అక్టోబ‌ర్‌లో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ రిలీజ్ కాబోతోంది. మొత్త‌మ్మీద‌..వ‌రుస‌గా మూడు నెల‌ల పాటు దేవిశ్రీ ప్ర‌సాద్ సంద‌డి చేశాడ‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం దేవిశ్రీ.. మ‌హేష్ భ‌ర‌త్ అను నేను, రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లంతో పాటు హ్యాపీ వెడ్డింగ్‌, ఎం.సి.ఎ చిత్రాలు చేస్తున్నాడు. ఈ ఏడాదిలో స‌క్సెస్‌రేట్‌ని బాగానే మెయిన్‌టెయిన్ చేసిన దేవిశ్రీ‌.. మున్ముందు కూడా అది కొన‌సాగిస్తాడేమో చూడాలి.

More News

'రాజా ది గ్రేట్' నిడివి ఎంతంటే..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం రాజా ది గ్రేట్‌. వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్ అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ‌ తొలిసారిగా అంధుడిగా న‌టించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

'దండుపాళ్యం3' మోషన్‌ పోస్టర్‌ విడుదల

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.

డాక్ట‌ర్‌గా కాజ‌ల్‌

10 ఏళ్ల కెరీర్‌లో 50 చిత్రాల‌ను చేసింది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఇటీవ‌లే వ‌చ్చిన నేనే రాజు నేనే మంత్రితో 50 చిత్రాల మైలురాయికి చేరుకుందీ ముద్దుగుమ్మ‌. ఇదిలా ఉంటే.. ఆమె న‌టించిన తాజా త‌మిళ చిత్రం మెర్స‌ల్ ఈ నెల 18న దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది.

క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకొన్న బాలకృష్ణ 102వ చిత్రం !!

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగుసింది.

ఈ 27న ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్ లో శివ సాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్  తాతా నిర్మిస్తున్న చిత్రం ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు. మహీదర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ కె. దర్శకత్వం వహిస్తున్నారు.