Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. మధ్యంతర బెయిల్

  • IndiaGlitz, [Friday,May 10 2024]

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసులో అరెస్టైన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్ 1 వరకూ బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ట్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం తీర్పు వెల్లడించింది. తిరిగి జూన్ 2న లొంగిపోవాలని సూచించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 20వరకు పొడిగించింది. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాడీవేడీగా వాదనలు జరిగాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారం చేసేందుకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఈడీ మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రచారం చేసే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ బెయిల్ ఇస్తే సీఎంగా బాధ్యతలకు దూరంగా ఉండాలని కేజ్రీవాల్‌కు స్పష్టం చేసింది. అంతేకాదు బెయిల్‌పై విడుదలైతే ఎలాంటి ఫైళ్లపై సంతకాలు చేయరాదని సూచించింది.

ఇది అసాధారణ పరిస్థితి అని కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని.. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని ధర్మాసనం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయని ఓ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా ఆయనకు ప్రచారం చేసుకునేందుకు వీలుగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కాగా ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. దీంతో ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి అభ్యర్థుల తరపున కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. కాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేయగా.. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

More News

పేదలతో టీడీపీ ముఠా చెలగాటం.. డబ్బులు జమ అవ్వకుండా విశ్వప్రయత్రాలు..

ఓటమి భయంతో టీడీపీ నేతలు దారుణంగా ప్రవరిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాల నిధులను నిలువునా అడ్డుకుంటున్నారు.

CM Jagan:మళ్లీ జగనే సీఎం.. ప్రముఖ సర్వేలో సంచలన విషయాలు..

ఏపీలో పోలింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Chiranjeevi:పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి హాట్ కామెంట్స్

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Pawan:జగన్‌కు ఓటమి అర్థమైంది.. అందుకే బేల మాటలు: పవన్

సీఎం జగన్‌కు ఓటమి అర్థమైందని.. అందుకే ఆయన నోటి నుంచి బేల మాటలు వస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు.

R. Krishnaiah:టీడీపీ నేతల అరాచకం.. బీసీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్యపై రాళ్ల దాడి

టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓడిపోతున్నామని తెలిసి నిస్సహాయతతో వైసీపీ నేతలపై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.