క్రేజీ రోల్‌లో దీపికా పదుకొనె..!

  • IndiaGlitz, [Monday,January 04 2021]

బాలీవుడ్‌ స్టార్స్‌కు పాత్ర నచ్చితే చాలు.. హీరోగానే నటించాలని చూడరు. ప్రతినాయకుడిగానైనా తెరపై సందడి చేయడానికి రెడీ అయిపోతుంటారు. హీరోలే కాదు.. హీరోయిన్స్‌ కూడా ఇదే పంథాను ఫాలో అవుతుంటారు. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌ వంటి స్టార్‌ హీరోయిన్స్‌ నెగటివ్‌ షేడ్స్‌లో మెప్పించినవారే. ఇప్పుడు వీరి బాటలోకి మరో ముద్దుగుమ్మ అడుగుపెట్టనుంది. ఆమె ఎవరో కాదు.. దీపికా పదుకొనె. ఒక వైపు స్టార్‌ హీరోయిన్‌గా చేస్తూనే నెగటివ్‌ షేడ్‌లో నటించడానికి దీపికా ఒప్పుకోవడానికి కారణం.. ఆఫర్‌ ఇచ్చింది భారీ నిర్మాణ సంస్థ. అది కూడా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన క్రేజీ ఫ్రాంఛైజీ. వివరాల మేరకు బాలీవుడ్‌లో భారీ చిత్రాలను నిర్మించే యశ్‌రాజ్‌ ఫిలింస్‌ ధూమ్‌ 4 సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుంది.

ఈ ఫ్రాంచైజీలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించే హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకు మించిన ప్రాధాన్యత దొంగతనాలు చేసే దొంగ పాత్రకు ఉంటుంది. ఇప్పటి వరకు ధూమ్‌ ఫ్రాంఛైజీలో మూడు భాగాలు ప్రేక్షకుల ముందుకు వస్తే అన్నీ విజయాన్ని సాధించాయి. ధూమ్‌లో జాన్ అబ్రహం భారీ దొంగతనాలు చేసే దొంగ పాత్రలో నటిస్తే, ధూమ్‌2లో హృతిక్‌ రోషన్‌ దొంగ పాత్రలో కనిపించాడు. ధూమ్‌ 3లో ఆమిర్‌ ఖాన్‌ దొంగ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. మరి ధూమ్‌ 4లో దొంగ పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై చాలా వార్తలే వినిపించాయి. ఒకానొక దశలో ప్రభాస్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే లేటెస్ట్‌ బాలీవుడ్‌ వర్గాల సమాచారం మేరకు ధూమ్‌ 4లో దొంగ పాత్రలో దీపికా పదుకొనె నటించనుందట. మరి దీపికా ప్రేక్షకులను ఈ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలో ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి.

More News

కోవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్ అనుమతి..

హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్‌కు ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) లైసెన్సింగ్ అనుమతిని మంజూరు చేసింది.

మాదకద్రవ్యాల కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్..

మాదక ద్రవ్యాల కేసు.. టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసి.. తరువాత బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించి చివరకు తిరిగి టాలీవుడ్‌ మెడకూ చుట్టుకుని ఇటీవలి కాలంలో సైలెంట్ అయిపోయింది.

'చెక్' ఫస్ట్  గ్లింప్స్ రిలీజ్!!

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై  వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "చెక్".

జనవరిలో సందడే సందడి.. 5 సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్..

లాక్‌డౌన్ కారణంగా మూత పడిన థియేటర్లన్నీ దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

బెల్లంకొండ‌కు ఆమె ఓకే చెబుతుందా..?

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. తెలుగులో స్టార్ హీరో ప్ర‌భాస్‌ను మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిన మూవీ ‘ఛ‌త్ర‌ప‌తి’ని