విచారణలో దీపిక కన్నీళ్లు.. ఎమోషనల్ డ్రామా కట్టిబెట్టమన్న ఎన్సీబీ!

  • IndiaGlitz, [Monday,September 28 2020]

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్టార్ హీరోయిన్లను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఎన్సీబీ విచారణను తొలుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆ తరువాత దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా దాస్‌లను ఎన్సీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే దీపిక తన విచారణలో భాగంగా పలుమార్లు కన్నీటి పర్యంతమయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. కాగా.. ప్రతి దానికి దీపిక కన్నీరు పెడుతుండటంతో విసిగిపోయిన అధికారులు.. తీవ్ర అసహనానికి గురయ్యారని జాతీయ మీడియా తెలిపింది.

ఎమోషనల్ డ్రామాను కట్టిపెట్టి విచారణకు సహకరించాల్సిందిగా ఎన్సీబీ అధికారులు దీపికకు సూచించినట్టు సమచారం. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయసాహా సెల్‌ఫోన్‌లో బహిర్గతమైనది తన చాటింగేనని దీపిక అంగీకరించినట్టు సమాచారం. అయితే తాను డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని దీపిక వెల్లడించినట్టు తెలుస్తోంది. దీపికను ఐదు గంటల పాటు ఎన్సీబీ అధికారులు విచారించారు.