'దండుపాళ్యం3' మోషన్‌ పోస్టర్‌ విడుదల

  • IndiaGlitz, [Monday,October 16 2017]

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవల విడుదలైన 'దండుపాళ్యం2' కూడా రెండు భాషల్లోనూ సూపర్‌హిట్‌ అయింది. 'దండుపాళ్యం' సీక్వెల్స్‌లో భాగంగా ఇప్పుడు 'దండుపాళ్యం3' రాబోతోంది.

ఆర్‌4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రజని తాళ్ళూరి నిర్మిస్తున్న 'దండుపాళ్యం3' షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: రవిచంద్రన్‌, నిర్మాత: రజనీ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

More News

డాక్ట‌ర్‌గా కాజ‌ల్‌

10 ఏళ్ల కెరీర్‌లో 50 చిత్రాల‌ను చేసింది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఇటీవ‌లే వ‌చ్చిన నేనే రాజు నేనే మంత్రితో 50 చిత్రాల మైలురాయికి చేరుకుందీ ముద్దుగుమ్మ‌. ఇదిలా ఉంటే.. ఆమె న‌టించిన తాజా త‌మిళ చిత్రం మెర్స‌ల్ ఈ నెల 18న దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది.

క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకొన్న బాలకృష్ణ 102వ చిత్రం !!

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగుసింది.

ఈ 27న ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్ లో శివ సాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్  తాతా నిర్మిస్తున్న చిత్రం ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు. మహీదర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ కె. దర్శకత్వం వహిస్తున్నారు.

'కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌' షూటింగ్ ప్రారంభం!

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం 'కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌'. శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

14 ఏళ్ల త‌రువాత నాగ్‌..

కింగ్ నాగార్జున, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మది సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్రం శివ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మాత్ర‌మే కాదు ట్రెండ్ సెట్ట‌ర్ కూడా.