మే 3 వరకూ అమెరికా వీసాలకు బ్రేక్..

  • IndiaGlitz, [Wednesday,April 28 2021]

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ కీలక ప్రకటన జారీ చేసింది. మే 3 నుంచి అన్ని రకాల రోజువారీ వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసినట్లు హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ తాజాగా ప్రకటించింది. తదుపరి ప్రకటన చేసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. అన్ని రకాల నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు, ఇంటర్వ్యూ మాఫీ చేసినట్లు హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ వెల్లడించింది.

అమెరికా పౌరుల కోసం అన్ని రకాల రోజువారీ సేవల అపాయింట్‌మెంట్లను ఏప్రిల్‌ 27 నుంచి రద్దు చేసినట్టు హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ తెలిపింది. అమెరికా పౌరులకు అత్యవసర సేవలు, వీసా అపాయింట్‌మెంట్లు కొనసాగుతాయని పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం అత్యవసర అపాయింట్‌మెంట్లను మాత్రం యథాతథంగా జరుపుతామని తెలిపింది. స్థానిక పరిస్థితులు అనుకూలించేంత వరకు సేవలను రద్దు చేస్తున్నట్టు కాన్సులేట్ జనరల్ చెప్పింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ఇది అమల్లో ఉంటుందని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ వెల్లడించింది.

More News

ఇండియా తనకు రెండో ఇల్లు అంటూ బ్రెట్‌లీ భారీ విరాళం

భారత్‌లో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.

కోవిడ్‌పై సమరానికి సిద్ధమైన ఏపీ.. జగన్ కీలక ఆదేశాలు..

కోవిడ్‌పై సమరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు

ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.

పవర్ స్టార్ ‘ఖుషి’ సినిమాకు 20 ఏళ్లు...

ఎస్.జె.సూర్య దర్వకత్వంలో శ్రీ సూర్య ఫిలింస్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన సినిమా ‘ఖుషి’.

‘ఆచార్య’ విడుదలను వాయిదా

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’.