బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్లు సంచలన తీర్పు..

  • IndiaGlitz, [Wednesday,September 30 2020]

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాదాపు 28 ఏళ్ల తరువాత కోర్టు తీర్పును వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌‌ లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని కోర్టు పేర్కొంది. పథకం ప్రకారమే జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని తేల్చి చెప్పింది. నిందితులపై స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. మొత్తం 32 మందిపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని తేల్చింది.

నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనడంలో ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టు వెల్లడించింది. సీబీఐ సమర్పించిన వీడియో, ఆడియో ఆధారాలు ప్రామాణికంగా లేవని పేర్కొంది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా సీబీఐ స్పెషల్ కోర్టు ప్రకటించింది. 28 ఏళ్ల పాటు జరిగిన విచారణలో 351 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.

అయోధ్యలో 6 డిసెంబర్ 1992న బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటు చేసుకుంది. దీనిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 2001 మేలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అద్వానితో పాటు ఇతర నిందితులపై నేరపూరిత కుట్ర అభియోగాలను తొలగిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పును 2010లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లగా.. కుట్ర అభియోగాలను కొనసాగించాలని 2017 ఏప్రిల్ 19న ఆదేశించింది. రోజువారీ విచారణ కొనసాగించాలని.. రెండేళ్లలో తీర్పును వెలువరించాలని లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా.. నేడు తీర్పు వెలువడింది.

More News

సతీష్ మాలెంపాటి డైరెక్షన్ లో మర్డర్ మిస్టరీ 'సమిధ'

షార్ట్ ఫిలిం మేకింగ్ ద్వారా  తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

'షాదీ ముబారక్‌' ఫస్ట్‌ లుక్‌ విడుదల

సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'షాదీ ముబారక్‌'.

టాలీవుడ్‌కు కమెడియన్ల కొరత.. !

టాలీవుడ్‌లో కమెడియన్ల కొరత చాలా ఉంది. బ్రహ్మీ స్లో అయ్యాక మేకర్స్‌కు ఈ సమస్య ఎదురవుతోంది.

పెళ్లి పీటలెక్కబోతున్న యాంకర్ ప్రదీప్.. రాజకీయ నేత కూతురితో ఫిక్స్!

బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ ప్రదీప్. చాలా మంది మేల్ యాంకర్లు ఉన్నప్పటికీ స్పాంటేనియస్‌గా మాట్లాడుతూ..

ఆ మాటలను నేను ఒప్పుకోను : అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క.