వివాదస్పద డైరెక్టర్ కు కోర్టు నోటీసులు...

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

'ద్యావుడా' అనే సినిమా ఒక మ‌తాన్ని కించ‌ప‌రిచే రీతిలో ఉంద‌ని, ఈ సినిమా నిర్మాణానికి, విడుద‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌రాదంటూ సుబ‌ద్ర‌మ్మ అనే మ‌హిళ కోర్టులో కేసు వేసింది. దీనిపై స్పందించిన హైద‌రాబాద్ హైకోర్టు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల హోం శాఖ‌ల‌కు నోటీసులు జారీ చేసింది. అల్రెడి ఈసినిమాపై ద‌ర్శ‌కుడు సాయిరాం దాస‌రి ప్రేక్ష‌కుల‌కు, ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అయితే ఈ టీజ‌ర్‌ను తొల‌గించి, సినిమా నిర్మాణానికి అనుమ‌తి ఇవ్వ‌రాదంటూ ప‌లు హిందుమ‌త సంఘాలు ఆందోళ‌న తెలిపాయి. కేసు ప‌రిశీల‌నలో భాగంగా కేసును వ‌చ్చేవారానికి వాయిదా వేశారు.