AP Wine Shops:కౌంటింగ్ అలర్ట్.. ఏపీలో మూడు రోజులు మద్యం షాపులు బంద్

  • IndiaGlitz, [Wednesday,May 29 2024]

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మందుబాబులకు పోలీసులు, ఎన్నికల అధికారులు బ్యాడ్‌న్యూస్ అందించారు. మూడు రోజుల పాటూ మద్యం షాపులు మూతపడనున్నాయి. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపినట్లు తెలిపారు. అలాగే జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని.. రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు.

అంతేకాదు సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారం, వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ కారణంగానే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం షాపులను మూసివేస్తున్నారు. కౌంటింగ్ ముందు రోజు నుంచి.. కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు. అంతేకాదు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు కూడా అనుమతి లేదని, బాణసంచా వంటివి కాల్చడానికి వీల్లేదని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

కౌంటింగ్ సమయంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాల్లో జరిగిన ఘటనలతో ఎన్నికల సంఘం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. అలాగే అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరించింది. అంతేకాదు కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి అదనపు బలగాలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. జూన్ 15 వరకు ప్రత్యేక నిఘా కొనసాగించాలని కేంద్ర ఇంటిలిజెన్స్ అలర్ట్‌తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

More News

Balakrishna:మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

యంగ్‌ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది.

Jana Sena, YCP:పిఠాపురంలో నయా ట్రెండ్.. తగ్గదేలే అంటున్న జనసేన, వైసీపీ క్యాడర్..

ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది.  దీంతో అందరూ ఫలితాలతపై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Pinnelli: పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో మరోసారి భారీ ఊరట..

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి భారీ ఊరట దక్కింది. ఆయనపై నమోదైన మరో మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

RS Praveen Kumar: తెలంగాణ గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు పెత్తనం ఏంది బై: ఆర్‌ఎస్పీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని

Rakshana: పాయల్ రాజ్‌పుత్ 'రక్షణ' జూన్ 7న గ్రాండ్ రిలీజ్

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో