ప్రియదర్శికి రెండు సినిమాల్లోనూ కౌంటర్

  • IndiaGlitz, [Saturday,February 17 2018]

2016లో టెర్రర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ప్రియదర్శి. అయితే పెళ్లిచూపులు' చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ మూవీలో “నా చావు నే చస్తాను నీకెందుకు” అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యారు ఈ యువ న‌టుడు. ఈ చిత్రం విజయం సాధించడంతో గత రెండు సంవత్సరాలలో చాలా బిజీ కమెడియన్ అయిపోయారు ప్రియదర్శి.

ఇదిలా వుంటే...ఇదే డైలాగ్ ఈ శుక్ర‌వారం విడుదలైన మనసుకు నచ్చింది', అ' సినిమాల్లో కూడా రిపీట్ చేసారు దర్శకులు. మనసుకు నచ్చింది' చిత్రంలో బేబీ జాన్విని ఒక సన్నివేశంలో ప్రియదర్శి “పెద్దవాళ్ళ ఫంక్షన్ లో నువ్వేం చేస్తున్నావ్” అని అడిగితే “నా చావు నే చస్తాను నీకెందుకు” అంటూ రిప్లై ఇచ్చే సీన్ చాలా ఫన్నీగా చిత్రీకరించారు దర్శకురాలు మంజుల. ఇక అ' చిత్రంలో చేపకి వాయిస్ ఓవర్ ఇచ్చిన నాని కూడా ప్రియదర్శితో ఇదే డైలాగ్ ను చెప్పడం విశేషం. ఏ డైలాగ్ తో అయితే ప్రియదర్శి ఫేమస్ అయ్యారో....అదే డైలాగ్ ప్రియదర్శికి ఈ రెండు చిత్రాల్లోనూ కౌంట‌ర్‌గా ప‌డ‌డం విశేషం.

More News

వేసవి సందడి.. సమంతదే

గత నాలుగేళ్ళుగా వేసవిలో తన సినిమాలతో..సమంత బాగానే సందడి చేస్తోంది.

సుకుమార్.. ముచ్చటగా మూడోసారి

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమై 14 ఏళ్లు అవుతోంది.

నితిన్ జోడీగా రాశి ఖ‌న్నా?

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'తొలి ప్రేమ' సినిమా విజ‌యంతో మ‌రోసారి ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమాలో వ‌ర్ష పాత్ర‌లో యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ని..తాజాగా ఓ మంచి అవ‌కాశం వ‌రించింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వరుణ్ మెగా కుటుంబం గర్వపడే సినిమా చేశాడు: మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన 'తొలిప్రేమ'

'చెన్నై చిన్నోడు' ఆడియో లాంచ్

జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూ సంగీతాన్ని సమకూర్చిన ఓ తమిళ చిత్రాన్ని 'చెన్నైచిన్నోడు'