కరోనా కష్టాలు మహానటికే తప్పడం లేదు!!

  • IndiaGlitz, [Monday,May 11 2020]

కరోనా ప్రభావంతో చాలా రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది. ఎంత‌లా అంటే అస‌లు క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా థియేట‌ర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి. సినిమా షూటింగ్‌లు త్వ‌ర‌లోనే స్టార్ట్ అయ్యే అవ‌కాశాలున్నాయి. సినిమా థియేట‌ర్స్ విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డంతో చిన్న నిర్మాతల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. సినిమాల‌ను ఎప్పుడు విడుద‌ల చేసుకోవాల‌నుకోవ‌డంపై ఓ క్లారిటీ లేదు. దీంతో చిన్న నిర్మాత‌లు సినిమాల‌ను డిజిట‌ల్ మీడియాల్లో విడుద‌ల చేసుకోవ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. ఇప్ప‌టికే హీరో సూర్య స‌హా మ‌రి కొంతమంది తాము నిర్మించిన సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా మ‌హాన‌టి చిత్రంతో జాతీయ స్థాయిలో అవార్డు ద‌క్కించుకున్న కీర్తి సురేశ్ న‌టించిన సినిమాకే థియేట‌ర్స్ స‌మస్య తప్పేలా లేదు. కీర్తిసురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో కార్తీక్ సుబ్బ‌రాజ్ నిర్మించిన చిత్రం పెంగ్విన్‌. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్న స‌మ‌యంలో క‌రోనా ఎఫెక్ట్ రావ‌డంతో సినిమా విడుద‌ల ఆగింది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో పెంగ్విన్ సినిమా విడుద‌లవుతుంద‌ట‌. జూన్‌లో పెంగ్విన్ అమెజాన్‌లో ప్ర‌సార‌మ‌వుతుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందంటున్నారు.

More News

‘గ‌బ్బ‌ర్ సింగ్’ ... ప‌వ‌న్ స్టామినాకు ఓ మార్క్‌

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌... స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌కి సంబంధం లేకుండా హ్యూజ్ ఇమేజ్ ఉన్న ఏకైక టాలీవుడ్‌స్టార్‌. ఇలా చెప్ప‌డానికి కార‌ణం. సాధార‌ణంగా

రాజ‌మౌళి, మ‌హేశ్ సినిమాకు ముహూర్తం అదేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో సినిమాలు చేయాల‌ని నేటి త‌రం క‌థానాయ‌కులంద‌రూ ఎదురుచూస్తుంటారు. బాహుబ‌లితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రాజ‌మౌళి..

బాలీవుడ్‌కి అన‌సూయ... నిజ‌మెంత‌?

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈమె త‌ర్వాత ర‌ష్మీ గౌత‌మ్ ఉన్నారు.

డేవిడ్ వార్నర్‌కు పూరీ అతిథి పాత్ర ఆఫర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.

దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదికగా ఈ వేడుక జరిగింది.