తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అని రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 453. బుధవారం సాయంత్రం ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ మీడియా ముందుకొచ్చి వివరాలు వెల్లడించారు.

‘తెలంగాణ ఇవాళ 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 453. ఇప్పటి వరకు 45 మంది వైరస్ నుంచి కోలుకోగా 11 మంది చనిపోయారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 397యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. వీరిలో ఎవరూ వెంటిలేటర్ల మీద లేరు. సాధారణ ట్రీట్‌మెంటే జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన కోవిడ్ బాధితులంతా క్షేమంగా ఉన్నారు. వారందర్నీ రేపు డిశ్చార్జి చేస్తాం. మర్కజ్‌కు వెళ్లొచ్చిన 1100 మందికి పరీక్షలు చేశాం. వారికి దగ్గరగా మెలిగిన 3158 మంది క్వారంటైన్ చేశాయి. రాబోయే రోజుల్లో అనుమానితుల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్రంలో మందుల కొరత లేదు. డాక్టర్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. మొత్తం 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సైతం కోవిడ్ ఆస్పత్రులుగా పనిచేస్తాయి’ అని ఈటల రాజేందర్ మీడియాకు వెల్లడించారు.

More News

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో అస్సలు తిరగకండి!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో.

లాక్‌డౌన్ పొడిగింపు పక్కా.. IRCTC సంకేతాలు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి మార్చి 24 నుంచి ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం విదితమే.

ఒక్కరోజే ఇండియాలో 32 మంది మృతి.. 773 కరోనా పాజిటివ్‌లు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇండియాలో కూడా దీనిప్రభావం గట్టిగానే పడింది. రోజురోజుకు కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

ఎన్టీఆర్‌, మోహ‌న్‌లాల్‌... సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

ప‌వ‌న్‌, ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్‌.. రీమేకా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.