పవన్ ‘వకీల్‌సాబ్’ మ‌రింత వెనక్కి..?

  • IndiaGlitz, [Tuesday,April 14 2020]

పవర్‌స్టార్‌, జ‌న‌సేనాని రీ ఎంట్రీ మూవీ ‘వకీల్‌సాబ్‌’. ముందుగా ఈ చిత్రాన్ని మే 15న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీ క‌పూర్ భావించారు. అయితే క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగింది. దీంతో విడుద‌ల తేదీని మార్చుకోవాల్సిన ప‌రిస్థితి క‌న‌ప‌డుతుంది. ఏరోజున విడుద‌ల చేయాల‌ని నిర్మాలు ఆలోచించుకున్నారు. ముందుగా జూలైలో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే క‌రోనా ప్ర‌భావంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలాగానే అనిపించ‌డంతో ‘వకీల్‌సాబ్’ను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేస్తార‌ని కూడా వార్త‌లు వినిపించాయి.

కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ‘వకీల్‌సాబ్’ మ‌రింత వెనక్కి వెళ్లేలా ఉంద‌ని అంటున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. దీంతో దిల్‌రాజు సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. మంచి రిలీజ్ డేట్‌కే ‘వకీల్‌సాబ్’ను తీసుకు రావాల‌ని దిల్‌రాజు అనుకుంటున్నాడ‌ట‌. అందువ‌ల్ల కాస్త ఆల‌స్య‌మైనా ద‌స‌రాకే రావాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేకే ‘వకీల్‌సాబ్’. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంతో పాటు ప‌వ‌న్ మ‌రో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

More News

స‌మంత వంట గురించి అమ‌ల ఏమ‌న్నారంటే..?

టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ల్లో స‌మంత అక్కినేని ఒక‌రు. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే అక్కినేని నాగ‌చైత‌న్య‌త‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్ద‌రూ 2017లో పెళ్లి చేసుకున్నారు.

భారీ రెమ్యున‌రేష‌న్ అడిగిన ర‌మ్య‌కృష్ణ‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి

మే-03 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు వెనుక 3 కారణాలు..!

యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అంటే మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ ఉండనుంది.

ఏప్రిల్-20 తర్వాత సడలింపులు.. ఒక్క కేసు పెరిగినా..: మోదీ

ఏప్రిల్- 20వరకూ కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ఆ తర్వాత కరోనా హాట్ స్పాట్‌లు లేని ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

కరోనా కట్టడికి ఈ ఏడు సూత్రాలు పాటించండి: మోదీ

కరోనాపై ‘సప్తపది’తో విజయం సాధించవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసగించిన మోదీ.. దేశ వ్యాప్తంగా మే-03 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని కీలక ప్రకటన చేశారు.