తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. రూ.12 కోట్లు సుపారీ

  • IndiaGlitz, [Thursday,March 03 2022]

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత వీ. శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. మంత్రితో పాటు ఆయన అనుచరుల హత్యకు సుపారీ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని వెనుక సూత్రధారులు మహబూబ్‌నగర్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.

రూ.12 కోట్లతో మంత్రిని చంపించేందుకు ఫరూక్‌ అనే వ్యక్తిని సంప్రదించగా.. అతడు పేట్‌బషీర్‌బాద్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు కుట్రలో భాగస్వాములైన మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లపై గతంలోనూ పలు హత్య కేసులు ఉన్నాయి. ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాగరాజు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు రఘును ఢిల్లీలో బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో అరెస్టు చేశారు. అలాగే రఘుకు ఆశ్రయమిచ్చిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి విడుదల చేశారు.

అయితే 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌తో ఈ హత్య కేసుకు లింకులు వున్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌లో అక్రమాలు వున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు.

More News

రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. మరో భారతీయ విద్యార్ధి మృతి

ఉక్రెయిన్- రష్యా యుద్ధం భారతీయుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇప్పటికే నిన్న ఖార్కీవ్‌లో రష్యా సైనికుల దాడిలో

తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అందరిముందు చెప్పుతో కొట్టుకున్నారు. ఆయనేందుకు ఇలా చేశారంటే...

ఘనంగా జరుపున్న 'సెబాస్టియన్‌ పిసి524’ ప్రి. రిలీజ్ ఈవెంట్

పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యం లోని

కొత్త గా బ్రహ్మానందం తనయుడు గౌతమ్

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా  రూపొందతున్న సినిమా  గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది

రష్యా- ఉక్రెయిన్ వార్: భారతీయుల ఇబ్బందులపై హీరో రామ్ పోతినేని ఎమోషనల్ ట్వీట్

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడికి వెళ్లిన భారతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.