Congress:ఈనెల 4న కేబినెట్ భేటీపై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

  • IndiaGlitz, [Saturday,December 02 2023]

ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఇతర సీనియర్ నేతలు సీఈవోను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రైతుబంధు కింద ₹6వేల కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్‌లో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అసైన్డ్‌ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయకుండా చూడాలని.. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాగే ఈ నెల 4న కేసీఆర్‌ కేబినెట్‌ భేటీ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదని.. రాజీనామాలు సమర్పించేందుకే మంత్రివర్గ సమాశేశం ఏర్పాటు చేసి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. ఫలితాల రోజు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ధ్రువపత్రాలను తమ పార్టీ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు తీసుకుంటారని.. ఈ మేరకు ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరామన్నారు.

కాగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో మళ్లీ అధికారంపై గులాబీ బాస్ ధీమా వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చూసి నేతలు, కార్యకర్తలు హైరానా పడొద్దని.. ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు.

More News

Silk Smitha:సిల్క్ స్మిత బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల.. అదిరిపోయిందిగా..

దివంగత నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా మరో బయోపిక్‌ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె జయంతిని పురస్కరించుకుని ‘సిల్క్‌ స్మిత- ది అన్‌టోల్డ్‌ స్టోరీ’

Majority of Seats:మెజార్టీ సీట్లు రాకపోతే ఎలా..? మంతనాల్లో నిమగ్నమైన పార్టీలు..

మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందో రేపటితో తేలిపోనుంది.

Congress:ఇండియా టుడే సర్వేలోనూ కాంగ్రెస్‌కే పట్టం.. సీఎంగా మొగ్గు ఎవరికంటే..?

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దీంతో తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.

Animal:బాక్సాఫీస్‌పై రణ్‌బీర్ వైల్డ్‌నెస్.. దుమ్మురేపిన 'యానిమల్' కలెక్షన్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకడు సందీప్ రెడ్డి వంగా కాంబో వచ్చిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

Bigg Boss Telugu 7 : శెభాష్ అర్జున్ .. వైల్ట్‌కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి , గ్రాండ్ ఫినాలే‌కి ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచి

బిగ్‌బాస్ 7 తెలుగు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఫినాలే అస్త్ర కోసం పోటీ జరుగుతోంది.