మెహ‌రీన్‌ పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌ లో పిర్యాదు

  • IndiaGlitz, [Tuesday,November 27 2018]

పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ కౌర్‌కి ఈ మ‌ధ్య స‌రైన హిట్ చిత్రాలు రావ‌డం లేదు. దీంతో చిత్రాల ఎంపిక‌లో మ‌రీ అచి తూచి అడుగులు వేయ‌డానికి మెహ‌రీన్ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డుపై రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత రిజ్వాన్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌లో పిర్యాదు చేశార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సుధీర్‌బాబుతో సినిమా చేయాల్సి ఉంది. అంతా ఓకే అనుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ‌రీన్ ఫిక్స్ అయ్యింది. ఈమెకు నిర్మాత‌లు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ఈ సినిమా నుండి సుధీర్‌బాబు అర్ధాంత‌రంగా చేయ‌లేన‌ని వైదొలిగాడు.

ఇప్పుడు ఆ ప్లేస్‌లో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ల్యాణ్‌దేవ్ వ‌చ్చాడు. అయితే క‌ల్యాణ్‌దేవ్‌తో న‌టించ‌డానికి మెహ‌రీన్‌కి ఆస‌క్తిలేక సినిమాలో న‌టించ‌న‌ని చెప్పేసింద‌ట‌. ఆమె తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వ‌డం లేద‌ట‌. దాంతో నిర్మాత‌లు చేసేది లేక ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్స్‌లో కంప్లైంట్ చేశార‌ని సినీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

More News

సాఫ్ట్ వేర్ స్కాండల్‌ పై చిత్రం

సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీస్‌లో ఒక‌ప్పుడు స‌త్యం అంటే ఓ పేరుండేది. ఆ సంస్థ అధినేత స‌త్యం రామ‌లింగ‌రాజు నిధులను దుర్వినియోగం చేశారు.

'2.0' లో దాగున్న సీక్రెట్ అదే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

పంతుల‌మ్మ పాత్ర‌లో...

'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రంలో దెయ్యం ప‌ట్టిన అమ్మాయిలా త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న నందితాశ్వేతా త‌ర్వాత శ్రీనివాస క‌ల్యాణంలో సెకండ్ హీరోయిన్ పాత్ర‌లోన‌టించింది.

43 ఏళ్ల త‌ర్వాత నేను అతృత‌గా చూడాల‌నుకుంటున్న చిత్రం '2.0' - రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్‌ వండర్‌ '2.0'. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న విడుదలవుతుంది.

మ‌రోసారి కూడా మ‌ల్టీస్టార‌రేనా?

ఈ ఏడాది విడుద‌లైన న‌వాబ్ చిత్రంతో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రంగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌నే తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.