అయినా పోటీ త‌ప్ప‌డం లేదు

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

అల్లుడు శీను చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌. ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఆ త‌రువాత స్పీడున్నోడు, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌తో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం సాక్ష్యం చేస్తూ.. బిజీగా ఉన్నారు. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్త‌రాది భామ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. తొలుత మే 11న విడుద‌ల చేయాల‌నుకున్న ఈ సినిమాని.. జూన్ 14కి వాయిదా వేశారు.

ఈ సినిమా విడుద‌ల తేది మారిన‌ప్ప‌టికీ పోటీ త‌ప్ప‌డం లేదు. మే 11న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ.. అదే స‌మ‌యానికి పూరీ మెహ‌బూబా, రాజ్ త‌రుణ్ రాజుగాడు విడుద‌ల కానున్న‌ట్లు ఆయా చిత్రాల యూనిట్స్ ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో సాక్ష్యంని వాయిదా వేశారు. ఇక సాక్ష్యం కొత్త విడుద‌ల తేది అయిన జూన్ 14న ల‌వ‌ర్‌, స‌మ్మోహ‌నం, తేజ్ ఐ ల‌వ్ యు విడుద‌ల కాబోతున్నాయి. విడుద‌ల తేది మారినా.. సాక్ష్యంకి పోటీ త‌ప్ప‌డం లేదు.

More News

చిరు ట్యాగ్ లైన్‌తో సాయిధ‌ర‌మ్

సుప్రీమ్ త‌రువాత మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం, జ‌వాన్‌, ఇంటిలిజెంట్‌..

అనుకున్న స‌మ‌యానికే ర‌వితేజ సినిమా

మాస్ మ‌హారాజా ర‌వితేజని మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చిన చిత్రం రాజా ది గ్రేట్‌.

విక్ర‌మ్ కుమార్‌కు నో చెప్పిన నాని

ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. అయితే ఇటీవ‌ల‌ విడుద‌లైన హ‌లో నిరాశ‌ప‌రిచింది.

రామ్‌తో తొమ్మిదేళ్ళ త‌రువాత‌..

యువ క‌థానాయ‌కుడు రామ్ ప్ర‌స్తుతం హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

దేవిశ్రీ విష‌యంలో ఈసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

యంగ్ హీరో రామ్‌కు క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు.