సంక్రాంతి కామెడీ ట్రైన్ సిద్ధమవుతోంది : అనీల్ రావిపూడి

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

సూపర్‌స్టార్ మహేశ్, డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. మహేశ్ నటిస్తోన్న 26వ చిత్రమిది. మహేశ్ హీరోగా నటిస్తూ దిల్‌రాజు, అనీల్ రావిపూడితో కలిసి నిర్మాణంలోనూ భాగస్వామ్యం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ షెడ్యూల్ అంతా ఓ ట్రెయిన్‌లోనే చిత్రీకరణ జరగాల్సి ఉంది. అలాంటి సందర్భాల్లో సాధారణంగా ట్రెయిన్స్‌లోనే చిత్రీకరిస్తుంటారు. అయితే, షూటింగ్‌ డిస్ట్రబెన్స్ లేకుండా, ఓ స్పెషల్ ట్రైన్ సెట్‌ను వేశారు. అందులోనే ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు.

'సెకండ్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ సంక్రాంతికి హిలేరియస్ ట్రైన్ ఎపిసోడ్ వేచి చూస్తుంది. సూపర్ స్టార్ ఎంటర్‌టైన్ చేస్తారు సిద్ధంగా ఉండండి' అంటూ ఈ షెడ్యూల్ గురించి డైరెక్టర్ అనీల్ సోషల్ మీడియాలో స్పందించారు.