యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా 'కొలంబస్'

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం 'కొలంబస్'. 'డిస్కవరీ ఆఫ్ లవ్' అనేది ఉపశీర్షిక.ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. మంచి చిత్రాలు నిర్మించాలనే ఆకాంక్షతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అశ్వనీ కుమార్ సహదేవ్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓ వైవిధ్యభరితమైన కథను ఎన్నుకున్నారు. తమ సంస్థకు మంచి పేరు తెచ్చుకోవడం మాత్రమే కాదు.. సుమంత్ అశ్విన్ సక్సెస్ పరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ - ''ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఇందులో సుమంత్ అశ్విన్ క్యారెక్టర్ చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. సుమంత్ అశ్విన్ సక్సెస్ పరంపరంను కొనసాగించే చిత్రం ఇది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. రీ-రికార్డింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. డీటీయస్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. మా సంస్థ ద్వారా వస్తున్న ఈ తొలి చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

సుమంత్ అశ్విన్ సరసన సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర.

More News

'చీకటిరాజ్యం' ట్రైలర్ రివ్యూ

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా రాజ్ కమల్ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.స్వెలని దర్శకునిగా పరిచయంచేస్తూ ఎన్.చంద్రహాసన్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘చీకటిరాజ్యం’.

త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడా..?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్... హీరో నితిన్ తో చేస్తున్న‌ సినిమా టైటిల్ అ ఆ.. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభించి..సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

విష్ణు సరసన అమల...?

మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో నూతన చిత్రం ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన సంగతి విదితమే.

ఒక్కడితో మొదలైంది

భైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఒకక్కడితో మోదలైంది సినిమా వచ్చే నెల రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత బి.మోహన్ తెలిపారు.

తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజున రామోజీ ఫిల్మ్‌ సిటీలో 'బహ్మోత్సవం' షూటింగ్‌ ప్రారంభం

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మోత్సవం'.