Revanth Reddy: దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీజిజీ.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ..

  • IndiaGlitz, [Wednesday,January 17 2024]

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీగా గడుపుతోంది. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇప్పటివరకు అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, ప్రపంచ ఆర్థిక సదస్సు చైర్మన్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు. రేవంత్ వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు ఉన్నారు.

ఆకట్టుకుంటున్న తెలంగాణ పెవిలియన్..

ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్‌ను 'వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్' ట్యాగ్ లైన్‌తో సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటేలా ఈ వేదికను రూపొందించారు. తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మ, బోనాల పండుగ, చార్మినార్ వంటి చారిత్రాత్మక చిహ్నాలను అందులో ఉంచారు. అలాగే 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' పేరులో తెలంగాణ కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, ఐటీ- సాంకేతిక ఆవిష్కరణల సౌధం టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్, విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా వాల్ డిజైనింగ్ తయారు చేశారు. ఇవి అక్కడ వారిని ఆకట్టుకుంటున్నాయి.

రేవంత్ న్యూ లుక్ ఫొటోలు వైరల్..

ఇదిలా ఉంటే ఈ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచ ఆర్థిక సదస్సు ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్(C4IR)హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. కాగా దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సూటుబూటుతో సరికొత్త లుక్‌లో కనిపించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా డ్రెస్ స్టైల్ మార్చారు. ఇప్పటివరకు తెల్ల చొక్కా, నల్ల ఫ్యాంటు మాత్రమే ఆయన ధరించారు. దీంతో ప్రస్తుతం రేవంత్ న్యూ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

More News

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేటి నుంచి విద్యుత్ కోతలు..

హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం షాకింగ్ వార్త అందించింది. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా హాయిగా గడుపుతున్న నగరవాసులకు ఉక్కపోత మొదలుకానుంది.

Naa Saami Ranga: అదరగొడుతున్న నాగార్జున.. 'నా సామిరంగ' మూడు రోజులు కలెక్షన్స్ ఎంతంటే..?

సంక్రాంతి పండుగకి కింగ్ నాగార్జున మరోసారి హిట్ కొట్టాడు. గతంలో సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు చిత్రంతో హిట్స్‌ కొట్టగా.. తాజాగా 'నా సామిరంగ' చిత్రంతోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అయింది.

Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఎక్స్(ట్విట్టర్)అకౌంట్ హ్యాక్‌ అయింది.

Anganwadis: సమ్మె ఉధృతం చేసిన అంగన్‌వాడీలు.. నేటి నుంచి నిరవధిక దీక్షలు..

రోజురోజుకు ప్రభుత్వంపై అంగన్‌వాడీలు పోరును ఉధృతం చేస్తున్నారు. తమ డిమాండ్స్ మొత్తం నెరవేరే వరకు సమ్మెను ఆపేది లేదని భీష్మించుకున్నారు. పండుగ సెలవులు కూడా లేకుండా ధర్నాలు చేస్తున్నారు.

క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు సుప్రీంకోర్టులో దక్కని రిలీఫ్

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును ఇచ్చింది.