మంటల్లో ఇరుక్కున్న కార్మికులను కాపాడిన బాలుడు.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

  • IndiaGlitz, [Saturday,April 27 2024]

హైదరాబాద్ శివారు షాద్‌నగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది కార్మికుల ప్రాణాలు కాపాడింది. దీంతో ఆ బాలుడి సాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాలుడిని అభినందించారు. యువకుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.

అసలు ఏం జరిగిందంటే.. షాద్‌నగర్‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ హోమియో అండ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా.. నిప్పురవ్వలు ఫైబర్ షీట్లపై పడి మంటలు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లోనే ఆ మంటలు పెద్ద రేకుల షెడ్ మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలు సుమారు 300 మంది కార్మికులు ఉండగా.. ఎగిసిపడిన మంటలను చూసి ప్రాణ భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.

అయితే మంటలు ఎగిసిపడటంతో సుమారు 50 మంది కార్మికులు లోపలే ఇరుక్కుపోయారు. అదే సమయంలో స్థానిక బాలుడు సాయిచరణ్ సమయస్ఫూర్తితో ఆలోచించి పెద్ద సాహసమే చేశాడు. ఒక పెద్ద తాడుతో భవనంపైకి ఎక్కి కిటికీకి దాన్ని కట్టాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న 50 మంది కార్మికులు తాడు సాయంతో కిందికి దిగారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. దీంతో సాయిచరణ్ సమయస్పూర్తిని, ధైర్యాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు.

సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి బాలుడిని అభినందించారు. రియల్ హీరో సాయిచరణ్ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ బాలుడికి రూ.10వేలు ఇస్తుండగా వద్దని చెప్పడం విశేషం. ఇలాంటి యువకులే దేశానికి, రాష్ట్రానికి కావాలంటూ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

More News

Telugu Indian Idol:అమెరికాలో తొలిసారిగా ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్' ఆడిషన్స్

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’.

Sarathi Studio: సారథి స్టూడియోస్‌లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలు ప్రారంభం

హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఐకాన్‌గా ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథి స్టూడియోస్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.

Varun Tej:బాబాయ్ పవన్ గెలుపు కోసం రంగంలోకి అబ్బాయ్ వరుణ్

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌

Mallareddy: మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్ అన్నా.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏం చేసినా.. మాట్లాడినా.. సంచలనమే. తన వ్యవహారశైలితో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

YS Jagan Vision: ఇది విజన్.. అందుకే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలి..

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు, రోడ్డు షోలకు జనం పోటెత్తుతున్నారు.