సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం...

  • IndiaGlitz, [Friday,August 21 2020]

శ్రీశైలం పవర్ ప్లాంటు ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తక్షణమే వెలికి తీయాలని.. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఖర్చుతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్య తీసుకోవాలని ఆదేశించారు.

గురువారం రాత్రి శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం పాతాళగంగలో ఉన్న ఈ భూగర్భ విద్యుత్తు కేంద్రం ఉంది. దీనిలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఇప్పటికే ఆరు మృతదేహాలను వెలికితీసి.. జెన్‌కో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమరరాజ కంపెనీ ఉద్యోగులున్నట్లు గుర్తించారు.

సహాయక చర్యల్లో సీఐఎస్ఎఫ్, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలగడమే కాకుండా పలువురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు. విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయినవారి కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు అందించాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

More News

సుశాంత్ వంట మనిషి విచారించిన సీబీఐ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి పెను సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే.

'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' టైటిల్ లుక్ విడుదల

కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్ లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణ లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్  కామెడీ

ఇది శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే.. ప్లీజ్.. ప్లీజ్: చిరంజీవి

ఏవో చిన్నాచితకా సినిమాలు తప్ప పెద్దగా షూటింగ్స్ ఏమీ మొదలు కాలేదు. దీంతో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుళ్లు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి.

సుశాంత్ మృతితో అండర్ వరల్డ్‌కు సంబంధాలున్నాయి: మాజీ ‘రా’ అధికారి

బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిపై మాజీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.