YS Jagan: వర్షాల కారణంగా సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన రద్దు

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

ఏపీ సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన రద్దైంది. మత్స్యకార దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దు చేసినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాల వల్ల సీఎం హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతాయని.. బహిరంగ సభకు వచ్చే ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనే కారణంలోనే పర్యటనను వాయిదా వేసిటన్లు తెలిపింది. త్వరలోనే ఈ పర్యటనను రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించింది.

ఈ పర్యటనలో భాగంగా వాకాడు మండలం రాయదరువు దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌.. రూ.94 కోట్లతో పులికాట్ సరస్సు సముద్ర ముఖ ద్వారం పూడికతీత పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అంతేకాదు ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని బాధితులకు కూడా ఇక్కడి నుంచే నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తడ మండలం, మాంబట్టులోని పారిశ్రామికవాడలో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సమయంలో అధికారంలోకి రాగానే పులికాట్ పూడిక తీయిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు నగరంతో పాటు రాపూరు, కలువాయి, చేజర్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. దీంతో తీర ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.

More News

Bigg Boss Telugu 7: ప్రశాంత్, గౌతమ్ మధ్య 'పంచె' పెట్టిన చిచ్చు.. అశ్విని షాకింగ్ డెసిషన్

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఆదివారం నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరు దక్కించుకోకపోవడంతో ఈ

IT Raids: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ దాడులు.. కార్యకర్తలు ఆందోళన

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నేతలకు ఐటీ దాడులు కలవరం పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారనే భయంతో ఉన్నారు.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ అధికారులు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Telangana Elections: తనిఖీల్లో రూ.1760కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం..

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నగదు, మద్యం ఏరులైపారుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.

ఫిషింగ్ హార్బర్ బాధితులకు అండగా సీఎం జగన్.. భారీగా పరిహారం ప్రకటన

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.