close
Choose your channels

YS Jagan: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

Friday, January 12, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

YS Jagan: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇటు పరిపాలనతో పాటు అటు పార్టీ కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే మరోవైపు పార్టీ గెలుపుపై తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఎన్నికల కదనరంగంలోకి దూకారు. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు జాబితాల్లో కలిపి 51 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

5 ప్రాంతాల్లో క్యాడర్ మీటింగ్‌లు..

ఇక మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఈ నెలాఖరు లోపు ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి కాగానే వచ్చే నెల నుంచి ఎన్నికల కురుక్షేత్రంలోనే ఉండనున్నారు. మరోవైపు క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 5 రీజియన్‌లలో క్యాడర్‌ మీటింగ్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 4-6 జిల్లాలను కలిపి ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పార్టీ సభ్యులందరినీ ఏకం చేసి.. వారిలో చైతన్యం నింపనున్నారు.

YS Jagan: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

విశాఖలో తొలి సమావేశం..

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించేలా కార్యకర్తలను సంసిద్ధం చేయడమే ఈ సమావేశాల ప్రధాన ఎజెండాగా చెబుతున్నారు. ఇందులో భాగంగా జనవరి 25వ తేదీన విశాఖపట్నం, భీమిలిలో తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సుమారు 3-4లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మిగిలిన 4 రీజియన్‌ల తేదీలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఇలా ఒక్కో ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

వైఎస్సార్ లాగే చరిత్ర సృష్టించేలా..

మొత్తానికి పార్టీ గెలుపే ధ్యేయంగా సీఎం జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసేలా పక్కా స్ట్రాటజీతో వెళ్తున్నారు. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేసేలా ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా.. ఎన్ని కుట్రలకు తెరలేపినా మొక్కవోని ధైర్యంతో ప్రజలే అండగా బరిలో దిగుతున్నారు. ఉమ్మడి ఏపీలో జరిగిన 2009 ఎన్నికల్లో ఎలాగైతే విపక్షాలన్ని కలిసి వచ్చినా తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారో.. తాను కూడా అలాగే ప్రతిపక్షాల కుతంత్రాలను జయించి మరోసారి ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించాలనే సంకల్ప బలంతో ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment