CM Jagan:కల్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

ఏపీలో మరో కీలక పథకానికి సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్యలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75 వేలు అందజేశారు. అలాగే మైనార్టీ, దూదేకుల, నూర్ భాషా కులస్థులకు రూ.లక్ష, భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.40 వేల చొప్పున నగదు విడుదలైంది. సాయం పొందిన జంటల్లో 8,042 మంది అమ్మఒడి లేదా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద కూడా ప్రయోజనాలు అందుతున్నాయని సీఎం జగన్ తెలిపారు.

ఈ పథకం కింద ఇప్పటివరకూ 3 త్రైమాసికాల్లో 3 విడతల్లో ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. 2022 అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ నాలుగు విడతతో కలిపి 46,062 జంటలకు రూ.349 కోట్లు వధువుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. బాల్యవివాహాలను ఆరికట్టేందుకు టెన్త్ సర్టిఫికెట్, వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలనే నిబంధన పెట్టామన్నారు. పదో తరగతి తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని.. ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాయని గుర్తు చేశారు.

అమ్మఒడి పథకం వల్ల పిల్లలను బడికి పంపేలా తల్లులు సిద్ధమతున్నారని.. అలాగే వైఎస్ఆర్ కల్యాణమస్తు నిబంధనల వల్ల ఇంటర్ వరకూ తమ పిల్లలను చదివిస్తారని చెప్పారు. ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల వల్ల గ్రాడ్యుయేట్ వరకూ చదివించేందుకు వెనుకాడరని పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ పథకం తీసుకొచ్చినట్లు జగన్ వెల్లడించారు.

More News

Rajinikanth, Kamal Haasan:ఒకే సెట్‌లో రజనీకాంత్, కమల్ హాసన్.. ఫొటోలు వైరల్..

భారతీయ సినీ చరత్రలో లెజెండ్స్‌గా నిలిచిపోయిన సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే సెట్‌పై కలిశారు.

Animal:యూట్యూబ్‌లో అదరగొడుతోన్న 'యానిమల్' ట్రైలర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో

Pawan Kalyan:ఇప్పుడు తెలంగాణలో పోరాడే రోజు వచ్చింది: పవన్ కల్యాణ్‌

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్‌లో రౌడీలను, గూండాలను ఎదుర్కొంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు.

CM Jagan:సీఎం జగన్ సహా 41 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై

Dalari:అన్నదమ్ముల కథ , వ్యవస్థలో లోపాలను టచ్ చేసే ‘‘దళారి’’ .. మరో బలగం అవుతుందన్న సినీ ప్రముఖులు

రాజీవ్‌ కనకాల, షకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక నటీనటులుగా కాచిడి గోపాల్‌రెడ్డి రచన దర్శకత్వంలో