AP DSC: నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. మెగా డీఎస్సీకి ఆమోదం..

  • IndiaGlitz, [Wednesday,January 31 2024]

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గత ఐదేళ్లుగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 6,100 పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. త్వరలో ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 40 అంశాలతో కూడిన అంశాలపై మంత్రివర్గం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు.. వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత నిధుల విడుదలకూ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి వారం రోజుల పాటు చేయూత వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు 18,750 రూపాయల చొప్పుడన ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.

ఇక విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఉన్న నాన్‌ టీచింగ్ స్టాఫ్‌ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒ సెక్రటరీ ఉండాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5వేల కోట్ల రూపాయల మేర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు.. 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.

మరిన్ని నిర్ణయాలు ఇవే..

ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనను మంత్రివర్గం
3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం
న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం
ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేచర్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
అసైన్డ్‌ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం
డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం
సీఎం కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో 25 మంది హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం
పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం
డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం

More News

President Murmu: 500 ఏళ్ల నాటి అయోధ్య రామమందిరం కల నెరవేర్చాం: రాష్ట్రపతి

పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రసంగించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌లో ఇవే తొలి బడ్జెట్ సమావేశాలు కావడం విశేషం.

Kumari Aunty: కుమారీ ఆంటీకి అండగా నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్‌ సెంటర్‌ను

Punjagutta Police Station: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట స్టేషన్ సిబ్బంది మొత్తం ట్రాన్స్‌ఫర్.. .

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ చరిత్రలోనే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు.

Kumari Aunty: కుమారి ఆంటీపై కేసు నమోదు.. వ్యాపారం క్లోజ్ చేయించిన పోలీసులు..

ఇటీవల కాలంలో ఫేమస్ అయిన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా చిన్న ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తున్నారు.

Gaddar Statue: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

దివంగత ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి HMDA ఆమోదం తెలిపింది.