చుట్టాల‌బ్బాయి రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Monday,August 01 2016]

సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై రామ్ తాల్లూరి, వెంక‌ట్ త‌లారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించిన చుట్టాల‌బ్బాయి ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇక మూవీ రిలీజ్ విష‌యానికి వ‌స్తే...చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని ఆగ‌ష్టు 5న రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ...కుద‌ర‌లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం...ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 13న రిలీజ్ చేయ‌నున్నారు. ఆది, సాయికుమార్ ఫ‌స్ట్ టైమ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం పై పాజిటివ్ టాక్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన చుట్టాల‌బ్బాయి చిత్రం హీరో ఆది, డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ కెరీర్ లో సూప‌ర్ హిట్ చిత్రంగా నిలుస్తుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి...వీరి న‌మ్మ‌కం నిజం అవుతుందో లేదో తెలియాలంటే ఈనెల 13 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

అందుకే..పూరి గోల్కండ‌లో ప్లాన్ చేసాడా

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం కోసం ప్ర‌స్తుతం గోల్కండ కోట‌లో క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నారు.

వాళ్లు దొంగ‌నాకొడుకులు అంటూ ఫైరైన రానా..

విజ‌య్ దేవ‌ర‌కొండ - రీతువ‌ర్మ జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లిచూపులు. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లిచూపులు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బడుతోంది.

కేర‌ళ‌లో యంగ్ టైగ‌ర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

బాలీవుడ్ రీమేక్‌లో శ్రీముఖి...

టీవీ యాంక‌ర్, సినిమా న‌టి అయిన శ్రీముఖి ఇప్పుడు వ‌రుస అవకాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు బాలీవుడ్ మూవీ హంట‌ర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

మ‌హేష్ మూవీ ఓకే అయ్యాకా ర‌కుల్ ఏం చేసిందో తెలుసా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.