సంక్రాంతి బ‌రిలో ‘ఆచార్య‌’..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. నిజానికి ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌నుకుని మెగాస్టార్ చిరంజీవి అండ్ టీమ్ భావించార‌ట‌. అయితే క‌రోనా సినిమాపై పెద్ద ప్ర‌భావాన్నే చూపించింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌లెట్టినా చిరంజీవి పార్ట్ పూర్తి చేస్తారు. త‌ర్వాతచిరంజీవి, కాజ‌ల్ మ‌ధ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంది. త‌ర్వాత కీల‌క పాత్ర‌లో న‌టించే రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ను చిత్రీక‌రించాల్సి ఉంది.

దీంతో అనుకున్నట్లు ఆగ‌స్ట్‌లో సినిమాను విడుద‌ల చేయలేం. పోనీ ఈ ఏడాది ద్వితీయార్థంలో అయినా చేద్దామంటే కెజియ‌ఫ్ 2, ప్ర‌భాస్ 20 ఇత‌ర సినిమాలు ఉంటాయ‌నుక‌న్నారు. కాబట్టే వ‌చ్చే ఏడాది స‌మ‌ర్మ్ అయితేనే బెస్ట్ అని భావించార‌ట‌. కానీ లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆర్ఆర్ఆర్ సంక్రాంతి పోరు నుండి త‌ప్పుకుంద‌ని, కాబ‌ట్టి సంక్రాంతికి బాస్ రావాల‌నుకుంటున్నాడ‌ని. మ‌రి వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.