మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా అఖిల్ 'హలో' గ్రాండ్ ఈవెంట్

  • IndiaGlitz, [Monday,December 18 2017]

యూత్‌ కింగ్‌ అఖిల్‌ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఫ్యామిలీ, రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రం 'హలో'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్‌ పొందింది. డిసెంబర్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చితం గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. డిసెంబర్‌ 20న హీరో అఖిల్‌ సహా యూనిట్‌ సభ్యులందరూ డిసెంబర్‌ 20న స్పెషల్‌ ప్రమోషనల్‌ షోను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
అఖిల్‌ యు.ఎస్‌. టూర్‌ గ్రాండ్‌ సక్సెస్‌
'హలో' ప్రమోషన్స్‌లో భాగంగా యు.ఎస్‌ టూర్‌లో న్యూజెర్సీ, సాన్‌జోస్‌, డల్లాస్‌లలో యూత్‌ కింగ్‌ అఖిల్‌, హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌తోపాటు మరో టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి పాల్గొని ప్రేక్షకులను థ్రిల్‌ చేశారు. ఆడియెన్స్‌ను పలకరిస్తూ వారితో ఆడి పాడారు. ముఖ్యంగా హీరో అఖిల్‌ యూనిట్‌తో కలిసి... హలో సినిమాలోని పాటలు పాడుతూ, లైవ్‌లో చేసిన ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ పెర్‌ఫార్మన్స్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. హీరో రానా దగ్గుబాటి.. వ్యాఖ్యాతగా వ్యవహరించి యూనిట్‌ సభ్యులకు ఎనర్జీని అందించారు. షో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావడంలో తన వంతు పాత్రను పోషించారు. యు.ఎస్‌లో గ్రాండ్‌ లెవల్లో నిర్వహించిన ఈ ప్రమోషనల్‌ షోకు ఆడియెన్స్‌ నుండి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది.

More News

29న 'అజ్ఞాత‌వాసి' సెన్సార్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం అజ్ఞాత‌వాసి. జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ర‌వితేజ హీరోయిన్ ఎవ‌రో..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ క‌థానాయ‌కుడిగా యువ ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కనున్న సంగ‌తి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

రామ్‌చ‌ర‌ణ్ విల‌న్ ద‌ర్శ‌కుడు కాబోతున్నాడు

అర‌వింద్ స్వామి.. పేరుకి త‌మిళ చిత్రాల క‌థానాయ‌కుడు అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ఆయ‌న సుప‌రిచితుడే. రోజా, బొంబాయి త‌దిత‌ర అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన అర‌వింద్‌.. మౌనం అనే స్ట్ర‌యిట్ తెలుగు సినిమా కూడా చేశారు. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న అర‌వింద్‌.. క‌డ‌లి సినిమాతో తిరిగి తెర‌పైకి వ‌చ్చారు.

బ‌న్ని కొత్త అవ‌తారం

క‌థానాయ‌కుడుగా అల్లు అర్జున్ స్థాయి ఏమిటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న బ‌న్ని.. ప్ర‌స్తుతం నా పేరు సూర్య సినిమా చేస్తున్నారు. ర‌చ‌యిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నారు.

నాని కూడా చేరుతాడా?

దిల్ రాజు.. స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ప్రొడ్యూస‌ర్ పేరిది. కొత్త ద‌ర్శ‌కుల‌తో ఎక్కువ విజ‌యాల‌ను అందుకున్న వైనం రాజు సొంతం. ఇదిలా ఉంటే.. దిల్ రాజు ఈ సంవ‌త్స‌రం ఏకంగా ఆరు చిత్రాల‌ను నిర్మించి వార్త‌ల్లోకెక్కారు.