చిరు విరామం...

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కాస్త విరామం తీసుకుని భార్య సురేఖ‌తో క‌లిసి జ‌పాన్ వెళ్లారు. చిరంజీవి, సురేఖ జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో ఉన్న ఫోటోల‌ను చిరు కుమార్తె సుస్మిత సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ జ‌పాన్ హాలీడే ట్రిప్ నుండి రాగానే చిరంజీవి.. సైరా చిత్రీక‌ర‌ణ కోసం చైనా వెళ్లబోతున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్రే 'సైరా న‌ర‌సింహారెడ్డి'. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా 200 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.