చిరు - నాగ్ త‌ర్వాతే బాల‌య్య‌..

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున త‌ర్వాతే న‌ట‌సింహం బాల‌య్య‌. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా...ఇండియా టుడే క‌వ‌ర్ పేజీ పై బాల‌య్య లెజండ‌రీ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈరోజు 3 గంట‌ల‌కు స‌చివాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి బాల‌కృష్ణ కూడా హాజ‌రు కానున్నారు. ఈ స్పెష‌ల్ బుక్ పై బాల‌య్య లెజెండ్ సినిమాలో స్టిల్ ముద్రించి ది లెజెండ్ అని టైటిల్ పెట్టారు. అంతే కాకుండా త‌న త‌రం హీరోల్లో ఏకైక ఆల్ రౌండ‌ర్. తండ్రికి త‌గ్గ త‌న‌యుడుగా సినీ, రాజ‌కీయ‌, సేవా రంగాల్లో చ‌రిత్ర సృష్టిస్తున్న అనిత‌రసాధ్యుడు అనే క్యాప్ష‌న్ కూడా పెట్టారు.

బాల‌య్య త్వ‌ర‌లో వందో సినిమా చేయ‌బోతున్న సంద‌ర్భంలో ఇండియా టుడే ఈ స్పెష‌ల్ బుక్ ను తీసుకువ‌చ్చింది. అయితే ఇండియా టుడే చిరంజీవి - నాగార్జున ల‌పై స్పెష‌ల్ ఎడిష‌న్ ను ఎప్పుడో తీసుకువ‌చ్చింది. చిరు - నాగ్ త‌ర్వాత బాల‌య్య పై ఇప్పుడు ఇండియా టుడే స్పెష‌ల్ ఎడిష‌న్ తీసుకువ‌చ్చింది. అయితే ఇండియా టుడే తెలుగు మ్యాగ‌జైన్ మూత‌ప‌డిన‌ప్ప‌టికీ బాల‌య్య కోసం స్పెష‌ల్ ఎడిష‌న్ తీసుకురావ‌డం విశేషం. ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ నంద‌మూరి అభిమానుల‌కు అరుదైన కానుక.

More News

చైతు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న మంజిమా మోహ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం పాట‌లు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు.

బాలీవుడ్ లో ఊపిరి

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. పి.వి.పి సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఊపిరి చిత్రాన్ని నిర్మించింది.

ముంబాయిలో స‌ర్ధార్ ఆడియో 

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ లో 800 ధియేట‌ర్స్ లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అవుతుండ‌డం విశేషం.

బంధాలు - బంధుత్వాల ప్రాముఖ్య‌త తెలియ‌చెప్పే మ‌నంద‌రి క‌థ ఊపిరి - డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి

మున్నా, బృందావ‌నం, ఎవ‌డు..చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తాజా చిత్రం ఊపిరి. టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని పి.వి.వి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది.