‘ఆచార్య’ టెంపుల్ టౌన్‌ సెట్‌ను చూశారా?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఓ అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర శివారులోని కోకాపేటలో ‘ఆచార్య’ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం తాజాగా కోకాపేటలో టెంపుల్‌ టౌన్‌ సెట్‌ వేశారు. ఇప్పుడు ఈ టెంపుల్ టౌన్ రికార్డ్ సృష్టించింది. దీని ప్రత్యేకత ఏంటంటే... దీని నిర్మాణం 20 ఎకరాల్లో జరిగింది. మన దేశంలోనే ఒక సినిమా కోసం ఇన్ని ఎకరాల్లో సెట్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈ సినిమా సెట్ రికార్డులకెక్కింది.

అయితే ఈ టెంపుల్ టౌన్ సెట్ గురించి వినడమే కానీ.. చూశారా? అంతటి అద్భుతమైన సెట్‌ను చూడాలన్న ఆసక్తి ఎవరికుండదు? చూస్తే మాత్రం వావ్.. అనక మానరు. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. దీనిని మెగాస్టార్ తన కెమెరాలో బంధించి అభిమానుల కోసం ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘అద్భుతమైన టెంపుల్ టైన్ సెట్ ‘ఆచార్య’ కోసం వేశారు. అద్భుతమైన కళకు నిదర్శనం. మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను’ అంటూ చిరు ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో.. బీభత్సమైన వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. అంతటి అద్భుతమైన సెట్‌ను వేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేష్‌ను మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు.

ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సోనూసూద్ విలన్‌గా నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఒక కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. రామ్ చరణ్ కోసం ఈ సినిమాలో ఒక పాటను కూడా పెట్టబోతున్నారని టాక్. ఈ చిత్రంలో చెర్రీ సరసన పూజా హెగ్డే నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా.. మేలో విడుదల కానుంది.

More News

మూడేళ్లుగా దాచిన రహస్యాన్ని బయటపెట్టిన ఇస్రో శాస్త్రవేత్త..

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

‘ఆచార్య’ సెట్‌లో ఆకట్టుకున్న సోనూసూద్.. 100 మందికి..

‘ఆచార్య’ షూటింగ్‌ సెట్‌లో ప్రముఖ నటుడు సోనూసూద్ ఆకట్టుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్..

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్‌ కూడా అరెస్ట్ అయ్యారు.

కర్ణాటక సీఎంకు రూ. 25 వేల జరిమానా..

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ డి.కున్హా రూ.25 వేల జరిమానా విధించారు.

డేట్ ఫిక్స్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి...!

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.