మరో కుటుంబానికి ఆపద్భాంధవుడైన మెగాస్టార్

కరోనా కారణంగా ఇటీవల కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కిలారి జయరామ్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు భార్య కె.శోభారాణి, ఒక కుమార్తె వినోదిని (8) ఇద్ద‌రు కుమారులు కౌశిక్ (18), జ‌స్వంత్(12) ఉన్నారు. జయరామ్ మృతి ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టివేసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆపద్భాంధవుడి అవతారం ఎత్తారు.

చిత్ర పరిశ్రమలో ఎవరు ఆపదలో ఉన్నా నేను ఉన్నానంటూ మెగాస్టార్ ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. కరోనా కష్ట సమయంలో వీలైనంత ఎక్కువగా అండగా నిలిచేందుకు చిరు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జయరామ్ కుటుంబాన్ని మెగాస్టార్ ఆదుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అత‌డి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ ని పంపించారు. జయరామ్ భార్య శోభ వారి పిల్ల‌లు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి వ‌చ్చి చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు ర‌వణం స్వామినాయుడు చేతుల‌ మీదుగా ఈ చెక్ ని అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా జయరామ్ భార్య శోభారాణి మాట్లాడుతూ 'చిరంజీవి గారు అన్నివేళ‌లా ఆప‌ద్భాంద‌వుడు. ప్ర‌తిసారీ మా కుటుంబానికి ఏ క‌ష్టం వ‌చ్చినా ఆదుకున్నారు. ఇంత‌కుముందు మా వారు బైక్ పై వెళుతూ యాక్సిడెంట్ కి గుర‌య్యారు. వెంట‌నే ఉపాస‌న గారికి ఫోన్ చేసి వైద్య స‌హాయం అందించారు. అప్పుడు మా కుటుంబానికి ఆర్థిక క‌ష్టం లేకుండా ఆదుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది నా పిల్ల‌ల‌కు పెద్ద సాయం. చిరంజీవి గారికి నా కృత‌జ్ఞ‌త‌లు' అని అన్నారు.

కరోనా సమయంలో చిరంజీవి వరుసగా అవసరమైన వారికి సాయం చేస్తూనే ఉన్నారు . ఇటీవల పావలా శ్యామల కుటుంబ పరిస్థితి తెలుసుకుని ఆర్థికంగా ఆదుకున్నారు.

More News

నెల్లూరులో కరోనాకు ఆయుర్వేదం మందుపై అధికారుల రిపోర్ట్..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఆయుర్వేదం మందును ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు.

నేషనల్ అవార్డు విన్నర్, డైరెక్టర్ విశ్వేశ్వరరావు కన్నుమూత.. ఎన్టీఆర్ తో..

ప్రముఖ నిర్మాత, దర్శకుడు విశ్వేశ్వరరావు కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం చెన్నైలో మృతి చెందారు.

అఫీషియల్: ఎన్టీఆర్ చిత్రాన్ని ఇలా ప్రకటించిన ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్ బర్త్ డే రోజున అభిమానులకు వరుసగా సర్ ప్రైజ్ లు ఎదురవుతున్నాయి.

పడిపోయిన మోదీ రేటింగ్..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తన అద్భుత ప్రసంగాలతో దేశాన్ని మొత్తం తనవైపు తిప్పుకున్నారు.

ముంచుకొస్తున్న మరో తుపాను..

ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తుపానులు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి.