మెగాస్టార్ ముఖ్య అతిథిగా 'తేజ్‌ ఐ లవ్ యు' ఆడియో

  • IndiaGlitz, [Wednesday,June 06 2018]

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ జరుగుతోంది. జూన్‌ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్‌' వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్‌ ఐ లవ్‌ యు' రూపొందుతోంది. ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ మ్యూజిక‌ల్ మెలోడీస్ అందించిన సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యంలో ఈ సినిమా పాట‌లు విడుద‌ల కానున్నాయి. జూన్ 9న హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌ర‌గ‌బోతున్న ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. 

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌. 

More News

అప్పుడు శంక‌ర్‌.. ఇప్పుడు పా.రంజిత్‌

ఎంత ఎదిగినా ఒదిగి ఉండమంటారు పెద్దలు. ఈ లక్షణాన్ని అలాగే పుణికి పుచ్చుకున్న నటుడు రజనీ కాంత్.

ద‌స‌రా సంద‌డంతా సునీల్ దేనా?

‘నువ్వేకావాలి’తో కమెడియన్‌గా పరిచయమై.. తక్కువ వ్యవధిలోనే తెలుగులో టాప్ కమెడియన్‌గా ఎదిగారు సునీల్‌.

'చినబాబు'కి బాలు డ‌బ్బింగ్ చెప్పారా?

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. పరిచయం అక్కరలేని పేరు. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని దాదాపు అన్ని భాషల్లోనూ పాట‌లు పాడి..

సూర్య‌.. రెండేళ్ళు బిజీ

'గ‌జిని' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌.

దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్న హీరోయిన్ తమన్నా

క్వీన్ రీమేక్ సెట్స్ లో  హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి  తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో  శరవేగంగా జరుగుతోంది.