చ‌ర‌ణ్‌పై చిరు ఫ‌న్నీ కామెంట్‌

కొడుకు చ‌ర‌ణ్‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ఓ ఫ‌న్నీ కామెంట్ చేశాడు. అది కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా... సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్ కాబ‌ట్టి ఎంత స్పీడుగా కామెంట్ స్ప్రెడ్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వివ‌రాల్లోకెళ్తే.. రామ్‌చ‌ర‌ణ్ నాన్న‌మ్మ అంజ‌నాదేవి ద‌గ్గ‌ర కొత్త రెసీపీ నేర్చుకున్నాడు.అదే వెన్న చిల‌క‌డం. ఒక‌ప్పుడు కవ్వంతో వెన్న తీసేవారు. కానీ ఇప్పుడు ఎల‌క్రిక‌ల్‌ మెషిన్స్ వ‌చ్చేశాయి. ఆ మెషిన్‌తోనే చ‌ర‌ణ్ వెన్న చిలికాడు. ఆ వీడియో త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు చెర్రీ. ఈ వీడియో సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అయ్యింది.

అయితే చ‌ర‌ణ్ చేసిన ప‌నికి చిరంజీవి ఫ‌న్నీ కౌంట‌ర్ ఇచ్చాడు. ‘‘మై డియర్ బచ్చా ...మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువ్వెంత వెన్న చిలికినా నీ పొజిషన్ బెటర్ కాదు. అదే గ్యారంటీ మీ అమ్మ దగ్గర లేదనుకో’’ అంటూ లాఫింగ్ సింబ‌ల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుంది. త్వ‌ర‌లోనే తండ్రీ కొడుకు మ‌రోసారి ఆచార్య సినిమాలో క‌లిసి న‌టించ‌బోతున్నారు. చిరంజీవి మాజీ న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టిస్తుంటే.. రామ్‌చ‌ర‌ణ్ ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కుడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తున్నారు.

More News

బాలీవుడ్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్

మన టాలీవుడ్ హీరోలు మార్కెట్ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తర్వలోనే రాజమౌళి

మ‌హేశ్ సినిమాలో వింకీ బ్యూటీ..?

ఓ చిన్న క‌న్నుగీట‌తో రాత్రికి రాత్రే నేష‌న‌ల్ ఫేమస్ అయ్యింది మ‌ల‌యాళ కుట్టి ప్రియా వారియ‌ర్‌. ఈమె న‌టించిన ల‌వర్స్‌డే సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు

వ‌రుణ్‌తేజ్‌ బ్యూటీతో బ‌న్నీ స్పెష‌ల్ సాంగ్..?

వ‌రుణ్ తేజ్‌తో ‘లోఫ‌ర్’ చిత్రంలో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ గుర్తుందిగా! ఎలా మ‌ర‌చిపోతారు. బాలీవుడ్‌లో త‌న హాటు అందాల‌తో సెగ‌లు రేపుతుందీ అమ్మ‌డు.

నాన్న‌మ్మ ద‌గ్గ‌ర రెసిపీ నేర్చుకుంటోన్న చ‌ర‌ణ్‌

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు సినీ సెల‌బ్రిటీలు. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే సెల‌బ్రిటీలంద‌రూ బీ ద రియ‌ల్ మేన్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

లాక్‌‌డౌన్‌లో లిక్కర్‌ అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు వారాల పాటు అనగా మే-17 వరకు కొనసాగనుంది.