దేవ‌ర‌కొండ కోసం చిరు..

  • IndiaGlitz, [Tuesday,August 07 2018]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించిన చిత్రం 'గీత గోవిందం'. జిఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్ర‌మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. గోపీ సుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమా పాట‌లు బ‌న్ని ముఖ్య అతిథిగా హాజ‌రై విడుద‌ల చేశారు.

కాగా ఈ నెల 12న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతుంది. ఈ ఫంక్ష‌న్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ సినిమాకు అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న కోరిక మేర‌నే చిరంజీవి ఈ ఫంక్ష‌న్‌కి చీఫ్ గెస్ట్ విచ్చేస్తున్నాడ‌ట‌.