విశాఖ ఉక్కుకు మద్దతు ప్రకటిస్తూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై టాలీవుడ్ విమర్శలను ఎదుర్కొంటోంది. పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇలాంటి సమయంలో కూడా టాలీవుడ్ నుంచి నిన్న మొన్నటి వరకూ ఒకరిద్దరు మినహా ఎవ్వరూ నోరు మెదిపింది లేదు. దీంతో టాలీవుడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన తన గళం విప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాలకు ప్రతీక అంటూ ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా కదలిరావాలని పిలుపునిచ్చారు. కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడలమీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

‘‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడలమీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు.. 9 ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్ప్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హక్కుగా.. ఆంధ్రుల ఆత్మగౌర ప్రతీకగా భావించి సంతోషించాం. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం.

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం.. అందువల్ల నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటు పరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నా. ఉద్యోగస్తులు, కార్మికుల భవిష్యత్‌ను, ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలి. విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన మక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికైనా టాలీవుడ్ విశాఖ ఉక్కుకు మద్దతుగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

More News

అంగారకునిపై హృదయ స్పందన శబ్ధాలు

అంగారక గ్రహం(మార్స్)కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. అంగారక గ్రహంపై జీవ మనుగడ గురించి తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) పంపిన రోవర్ పెర్సెవరెన్స్ అక్కడ

దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం..

తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌‌గా దేత్తడి హారిక నియామకం అయిన నాటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమెను పదవి నుంచి తొలగించారని ఒకరోజు.. లేదని మరొక రోజు వార్తలు వచ్చాయి.

అసలైన జాతిరత్నాలు వాళ్లే.. సెటైరికల్‌గా చెప్పట్లేదు: నవీన్ పొలిశెట్టి

ఇప్పటి వరకూ నవీన్ పొలిశెట్టి పేరు వినగానే గుర్తొచ్చేది ‘ఏజెంట్’. దాని నుంచి బయటకు వచ్చేందుకు చేసిన సినిమాయే ‘జాతిరత్నాలు’ అని నవీన్ పొలిశెట్టి తెలిపాడు.

'బాయ్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన హీరో కార్తికేయ

సినిమా రంగంలో, బిజినెస్ రంగంలో రాణిస్తూ ఏంతో మందికి సహాయం చేస్తూ సక్సెస్ విమెన్ గా దూసుకు పోతున్న మిత్ర శర్మ ఈ రోజు ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకొంది.బాయ్స్

‘సారంగదరియా’ వివాదంపై స్పందించిన శేఖర్ కమ్ముల

‘సారంగదరియా’ పాటపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని