నాగ్‌కి అద్భుతంగా వండి వడ్డించిన మెగాస్టార్..

మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఎంత మంచి స్నేహితులనేది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బిజినెస్ పార్ట్‌నర్స్‌గా ఉన్న వీరిద్దరూ.. ఇప్పటికి కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. వీరి ఇరు కుటుంబాల మ‌ధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ ఉంటే అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్ ఉన్న రెండు సీజన్లకూ చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్‌బాస్ స్టేజిపై వీరిద్దరూ కలిసి చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఇంతా కాదు. అలాగే కరోనా తర్వాత కూడా వీరిద్దరే ఇండస్ట్రీ తరుఫును బాధ్యత తీసుకుని సినీ కార్మికుల సమస్యలను చక్కదిద్దారు. షూటింగ్‌లకు సైతం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొచ్చారు.

తాజాగా నాగార్జున.. మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. నాగ్ రాకతో ఫుల్ ఖుషీ అయిన చిరు అద్భుతంగా వండి వడ్డించారు. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. చిరు ఏదో డిష్ చేస్తున్న దీనికి సంబంధించి నాగార్జున ఓ ఫోటోను సైతం ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం నాగ్.. ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు ఈ చిత్రం నేడు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా తాను నెర్వస్‌తో ఉన్నానని కాబట్టి గురువారం తాను చిరు ఇంటికి వెళ్లానని నాగ్ ట్వీట్ చేశారు. చిరు డెలీషియస్ ఫుడ్‌ను తనే వండి పెట్టి తనను కూల్ చేశారని నాగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘డెలీషియస్ డిన్నర్ మెగాస్టార్ తనే వండి పెట్టి ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ సందర్భంగా నాకోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. అయితే నాగ్ షేర్ చేసిన పిక్‌ని చిరు సతీమణి సురేఖ తీసినట్టు వెల్లడించారు. అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ‘వైల్డ్‌డాగ్‌’ రూపొందింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

More News

తమిళనాడులో బీజేపీకి గడ్డు కాలం.. ప్రచారానికి సైతం నో అంటున్న అన్నాడీఎంకే!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు.

వైష్ణ‌వ్ తేజ్ పంజా హీరోగా ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం

2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల‌ను

ఏపీలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్.. పోటీకి టీడీపీ దూరం

ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్, మున్సిపల్ పోరు ముగియగానే.. తాజాగా మరో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.

నో కిస్ పాల‌సీపై నివేదా పేతురాజ్ రియాక్షన్ ఇదీ...

‘బ్రోచేవారెవ‌రురా’, ‘చిత్రల‌హ‌రి’, ‘అల వైకుంఠ‌పురంలో..’ లాంటి చిత్రాల్లో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్‌.

ఆ సీన్‌ చూసి పవన్ చప్పట్లు కొట్టారు.. ఎగిరి గంతులేశా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.