అల్లు ఫ్యామిలీ, పవన్‌తో విబేధాలపై చిరు క్లారిటీ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తుంటాయ్. అయితే ఆ పుకార్లపై ఫ్యామిలీ నుంచి ఎవరూ రియాక్ట్ అవ్వకపోవడంతో చిత్ర విచిత్రాలుగా కథనాలు వచ్చేస్తుంటాయ్. దీంతో అసలేం జరిగిందో ఏంటో..? అనే అనుమానాలు, సందేహాలు మెగాభిమానుల్లో ఉండిపోయేవి. ఈ పుకార్లలో ఎక్కువగా.. చిరు-అల్లు అరవింద్ గొడవ జరిగిందని.. వారిద్దరూ ఎడ మొహం.. పెడ మొహంగా ఉన్నారని వార్తలు వినిపించాయి. రాజకీయాలకు రాం రాం చెప్పేసి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు గీతా ఆర్ట్స్‌కు చాన్స్ ఇవ్వకుండా సొంత బ్యానర్‌లో చేయడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో విబేధాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసుకున్నారు చిరు.

అబ్బే.. అవన్నీ పుకార్లే..!

అల్లు అరవింద్‌కు నాకు గొడవలున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు.. అవన్నీ పుకార్లే. మా మధ్య ఎలాంటి గొడవల్లేవ్. ఆయన మా కుటుంబ సభ్యుడు. మేమిద్దరం చాలా విషయాల్లో మాట్లాడుకుంటాం. ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటాం. ముఖ్యమైన విషయాల్లో అయితే కలిసి కూర్చొని చర్చించుకుంటాం. విబేధాలు అస్సలు లేవు’ అని మెగాస్టార్ తన మనసులోని మాటను ఇంటర్వ్యూ వేదికగా చెప్పేశారు. మరి దీనిపై అల్లు అరవింద్ ఎలా రియాక్ట్ అవుతారో..!

పవన్ విషయంలో..!

తమ్ముడు పవన్‌తో విబేధాలు ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో నా తమ్ముడు కూడా ఈ విషయంపై స్పందించాడు. మా మధ్య ఎలాంటి విబేధాల్లేవ్. ఇలాంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారో..? ఎందుకు చేస్తున్నారో..? అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజానికి పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను.. అందుకే రియాక్ట్ అవ్వను’ అని మెగాస్టార్ తేల్చిచెప్పేశారు.

ఫైనల్‌గా ఇన్ని రోజులుగా మెగాభిమానుల్లో నెలకొన్న అనుమానాలు, సందేహాలన్నీ క్లియర్ అయ్యాయన్న మాట. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చిరు అడుగుపెట్టిన తర్వాత యమా యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలోనూ టాలీవుడ్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తూ సినీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు.

More News

త్రిష ఒకలా.. మెగాస్టార్ మరోలా.. అసలేం జరిగింది!?

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే ఈ పాటికే సుమారు సగానికి పైగా సినిమా పూర్తయ్యేది.

తెలంగాణలో అందరూ మాస్క్‌లు వాడాల్సిందే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు మాస్క్‌లు ధరించడాన్ని

సూపర్ మార్కెట్‌లోకి నో ఎంట్రీ.. రాచకొండ సీపీ వార్నింగ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు అతి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అదనుగా

కరోనాపై పోరు: అగ్రరాజ్యం కంటే ఇండియా చాలా బెటర్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి.

చిరు ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ ఇంట్రెస్టింగ్ రిప్లయ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని నిర్మూలించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఓ వైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తున్న పోలీసులపై ప్రముఖులు ప్రశంసల జల్లు