చిరు, బాబీ కాంబోలో మల్టీస్టారర్.. మరో హీరో ఎవరంటే..

‘బలుపు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ. ఆ తరువాత పవన్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా చేసినప్పటికీ బాబీ అనగానే గుర్తొచ్చేది మాత్రం ‘జై లవకుశ’ సినిమానే. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రిబుల్ యాక్షన్ చేయించి మంచి హిట్ కొట్టారు. ఆ తరువాత ‘వెంకీమామ’ అనే మల్టీ స్టారర్‌ని తీసి హిట్ కొట్టిన బాబీ ఇప్పుడో అదిరిపోయే ఛాన్స్ కొట్టేశారని టాక్. ఈ సారి కూడా బాబీ మల్టీస్టారర్ మూవీనే తెరకెక్కించాలని అనుకుంటున్నట్టు సమాచారం. అయితే అది మరెవరితోనో కాదు.. మెగాస్టార్ చిరంజీవితో..

మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కథను రాసుకున్న బాబీ.. స్టోరీ లైన్‌ని చిరుకి కూడా వినిపించారట. దీనికి చిరు కూడా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమవుతోందట. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో హీరోగా సాయి తేజ్ నటించనున్నాడని టాక్. అంతా ఓకే అయితే ‘ఆచార్య’ తరువాత సెట్స్‌పైకి వచ్చేది ఈ సినిమాయేనని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఈ లోపు బాబీ కూడా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తాడని టాక్.

More News

నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడు: సీఎంకి కుష్బూ ఫిర్యాదు

తనను ఓ ఆగంతకుడు రేప్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ సోషల్ మీడియా

సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌..?

అల‌నాటి సావిత్రి జీవిత‌గాథ‌ను ‘మ‌హాన‌టి’ పేరుతో రీమేక్ చేస్తే అందులో సావిత్రి రూప‌ను త‌ల‌పిస్తూ అద్భుతంగా న‌టించిన కీర్తి సురేశ్‌కు నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది.

జగన్‌కు ప్రేమాలయం కట్టుకోండంటూ విరుచుకుపడిన రఘురామరాజు

కేంద్రం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు వై కేటగిరి భద్రతను కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన నేడు మీడియాతో మాట్లాడారు.

బ్రేకింగ్: రాష్ట్రాలకు కోవిడ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల

రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న కోవిడ్-19 ఫైనాన్షియల్ ప్యాకేజీలో భాగంగా సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద రూ.890.32 కోట్లను యూనియన్ గవర్నమెంట్ విడుదల చేసింది.

బ్రేకింగ్: ఎంపీ రఘురామరాజుకు వై కేటగిరీ భద్రత

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.