చిరంజీవి ముఖ్య అతిథిగా 'ఓ పిట్టకథ' ప్రీ రిలీజ్ ఈవెంట్
Friday, February 28, 2020 తెలుగు Comments

Listen to article
--:-- / --:--
1x

This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com


భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో – కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్ ఫిల్మ్ ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా, బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్ కానుంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ –‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్ లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments