‘ఆచార్య‌’ కోసం చిరు ఇలా.. కాజ‌ల్ అలా..!

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ కోవిడ్‌ నేపథ్యంలో రీస్టార్ట్‌ అయ్యింది. నవంబర్‌ 9న సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటే మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్ అనే వార్తలు రావడం, తర్వాత ఫాల్స్ కిట్ వల్ల వచ్చిన సమస్య అని తెలిసింది. అయినా కూడా చిరంజీవి రెండు వారాల పాటు వెయిట్ చేసి తర్వాత సెట్స్‌లో జాయిన్ అవుతున్నాడట‌. స‌మాచారం మేర‌కు న‌వంబ‌ర్ 20 నుండి మెగాస్టార్ ఆచార్య సెట్స్‌లో జాయిన్ కానున్నార‌ట‌. ఇక రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ కాజ‌ల్, హానీమూన్ ట్రిప్‌లో ఉంది. దీంతో ఆమె డిసెంబ‌ర్ 5 నుండి సెట్స్‌లో జాయిన్ అవుతుంద‌ని టాక్‌. ఈలోపు కొర‌టాల శివ ...చిరంజీవి లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారు.

చిరంజీవి జాయిన్‌ అయిన తర్వాత ఆయనపై సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దాని తర్వాత చరణ్‌ జాయిన్‌ అవుతాడట. దేవాదాయశాఖలోని అవినీతిని ప్రశ్నించేలా దర్శకుడు కొరటాల కథను ప్రిపేర్‌ చేశాడు. చిరంజీవి మాజీ నక్సలైట్‌ పాత్రలో నటిస్తుంటే.. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ నక్సలైట్‌ నాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమాను రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

More News

‘వ‌కీల్‌సాబ్’ సంక్రాంతి రేసులో లేన‌ట్టేనా?

2020 సినీ అభిమానులకు నిరాశను మిగిల్చిన సంవత్సరమనడంలో సందేహం లేదు. చిత్ర పరిశ్రమ దాదాపు ఆరేడు నెలల పాటు సైలెంట్ అయ్యింది.

ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు.. కొత్త జిల్లాలకు బ్రేక్..

ఏపీ‌లో కరోనా కారణంగా ఆగిపోయిన పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతోంది. ఈ ఎన్నికలు  ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: పవన్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.

క‌మెడియ‌న్‌కి విజ‌య్ సేతుప‌తి స‌పోర్ట్‌

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి మ‌రోసారి త‌న దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. సీనియ‌ర్ కోలీవుడ్ క‌మెడియ‌న్‌, ప‌లు చిత్రాల్లో కామెడీతో మెప్పించిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్

పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా.. ‘రియల్ హీరో’

రీల్ పరంగా విలన్.. రియల్‌గా మాత్రం దేశమంతా మెచ్చిన హీరో సోనూసూద్. లాక్‌డౌన్ ప్రారంభమైంది మొదలు..