చెన్నై హైకోర్టులో విశాల్‌కు చుక్కెదురు

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

త‌మిళ హీరో, నిర్మాత విశాల్‌కు మ‌ద్రాస్ హై కోర్టులో చుక్కెదురైంది. వివ‌రాల్లోకెళ్తే.. విశాల్ న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. జూన్ 23న న‌డిగ‌ర్ సంఘం ఎన్నికలు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో విశాల్ పాండ‌వ‌ర్ టీమ్‌, భాగ్య‌రాజా టీమ్‌కి మ‌ధ్య పోటీ జ‌రిగింది. ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి పెద్ద త‌తంగ‌మే జ‌రిగింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఓట్ల లెక్కింపు విష‌యంలో కూడా లొల్లి స్టార్ట్ అయ్యింది.

ఇప్పటికే న‌డిగ‌ర్ సంఘానికి సంబంధించిన కేసు కోర్టులో ఉండ‌టం కార‌ణంగా ఓట్ల లెక్కింపు విష‌యంలో వేచి చూడాల‌ని కోర్టు తెలియ‌జేసింది. అయితే ఈ తీర్పును స‌వాల్ చేస్తూ విశాల్ కోర్టులో మ‌ళ్లీ కేసు వేశారు. ఓట్ల లెక్కింపు చేయాల‌ని కోరారు. అయితే కేసుని ప‌రిశీలించిన కోర్టు.. తీర్పు అనంత‌ర‌మే ఓట్ల లెక్కింపు ఉంటుంద‌ని కోర్టు తేల్చేసింది. దీంతో తీర్పు కోసం విశాల్ వ‌ర్గం వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

More News

దర్పణం చిత్రం నుండి ఎదురయే  సాంగ్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'..

ర‌వితేజ మూడో హీరోయిన్ దొరికేసింది

`అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమా త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `డిస్కోరాజా`.

పోలీసులు, మీడియాతో ఆటలా సందీప్, ప్రియదర్శి!

టాలీవుడ్ కమెడియన్‌ కమ్ హీరోగా రాణిస్తున్న ప్రియదర్శి బుల్లెట్‌ వాహనం మిస్సయ్యిందన్న వ్యవహారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో

బంగారం బిజినెస్‌లోకి కాజ‌ల్‌

హీరోయిన్స్ అంద‌రూ వారి సంపాద‌న‌ను వారికి న‌చ్చిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చే్స్తుంటారు. కొంద‌రు హీరోయిన్స్ నిర్మాణ సంస్థ‌లు స్థాపించి, ఇక్క‌డే సినిమాలు తీస్తుంటారు.

నితిన్‌తో మ‌ళ్లీ... ఇల్లీ బేబీ!

`దేవ‌దాసు` సినిమా చేసి తెలుగు కుర్ర‌కారును త‌న న‌డుమొంపు సొగ‌సుల‌తో క‌ట్టిప‌డేసింది ఇలియానా.