చెన్నై హైకోర్టులో విశాల్కు చుక్కెదురు
- IndiaGlitz, [Tuesday,July 09 2019]
తమిళ హీరో, నిర్మాత విశాల్కు మద్రాస్ హై కోర్టులో చుక్కెదురైంది. వివరాల్లోకెళ్తే.. విశాల్ నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జూన్ 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో విశాల్ పాండవర్ టీమ్, భాగ్యరాజా టీమ్కి మధ్య పోటీ జరిగింది. ఈ ఎన్నికలు జరగడానికి పెద్ద తతంగమే జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ ఓట్ల లెక్కింపు విషయంలో కూడా లొల్లి స్టార్ట్ అయ్యింది.
ఇప్పటికే నడిగర్ సంఘానికి సంబంధించిన కేసు కోర్టులో ఉండటం కారణంగా ఓట్ల లెక్కింపు విషయంలో వేచి చూడాలని కోర్టు తెలియజేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ విశాల్ కోర్టులో మళ్లీ కేసు వేశారు. ఓట్ల లెక్కింపు చేయాలని కోరారు. అయితే కేసుని పరిశీలించిన కోర్టు.. తీర్పు అనంతరమే ఓట్ల లెక్కింపు ఉంటుందని కోర్టు తేల్చేసింది. దీంతో తీర్పు కోసం విశాల్ వర్గం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.