Chandrababu:అసంతృప్తులకు చెక్.. 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన చంద్రబాబు

  • IndiaGlitz, [Monday,April 22 2024]

టీడీపీ తరపున అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పోటీ చేసే అభ్యర్థులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంతా కృషి చేయాలని అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసిన ఆయన.. పార్టీ గెలుపు కోసం శ్రమించాలని సూచించారు. బీఫారాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో గెలిచి రావాలని పిలుపునిచ్చారు.

మరోవైపు పొత్తుల్లో బాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టికెట్లు దక్కని నాయకులు చాలా చోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో 5 చోట్ల అభ్యర్థులను చంద్రబాబు మార్చారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి స్థానాల్లో మార్పులు చేశారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించగా.. మాడుగుల స్థానం నుంచి బండారు సత్యనారాయణమూర్తిని ఖరారుచేశారు. ఇక పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మడకశిర నుంచి ఎంఎస్ రాజు, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు కేటాయించారు.

ఇక ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడంతో.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. మాడుగుల నుంచి పైలా గోవిందరావు స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ కేటాయించారు. పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేశ్ నాయుడుకు కేటాయించగా తాజాగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించారు. అలాగే మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని తొలుత మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారుచేయగా.. తాజాగా రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు.

ఇదిలా ఉంటే అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయను బీజేపీ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఒకవేళ నల్లమిల్లి బీజేపీ నుంచి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తే దెందులూరు నుంచి టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ పోటీకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈ క్రమంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరఫున పోటీలో ఉంటారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టంచేశారు.

More News

10th Class Results: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు.

Hanuman:హనుమాన్' సరికొత్త రికార్డ్.. ఎన్ని సెంటర్లలో 100 రోజులో తెలుసా..?

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' మూవీ సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది.

CM Jagan: నన్ను బచ్చా అంటున్న చంద్రబాబు పొత్తులతో ఎందుకు వస్తున్నాడు: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

Revanth Reddy: మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామనేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

Chandrababu:జగన్‌ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలు: చంద్రబాబు

తల్లిని, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్రాన్ని చూస్తారా? అని సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.