'చెక్' ఫస్ట్  గ్లింప్స్ రిలీజ్!!

  • IndiaGlitz, [Sunday,January 03 2021]

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులోకథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లిమ్స్ని ఆదివారం విడుదల చేశారు . జైలు లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్ , కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. 'HE IS INNOCENT' అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది.

ఈ సందర్బంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా. ఈచిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది . ప్రస్తుతం రీ - రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ‘ఐతే ‘ చిత్రం తర్వాతచంద్రశేఖర్ యేలేటి - కళ్యాణి మాలిక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఇదే. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపారు.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ''చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్షపడ్డ ఖైదీ కథ ఇది '' అని చెప్పారు.

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

More News

జనవరిలో సందడే సందడి.. 5 సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్..

లాక్‌డౌన్ కారణంగా మూత పడిన థియేటర్లన్నీ దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

బెల్లంకొండ‌కు ఆమె ఓకే చెబుతుందా..?

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. తెలుగులో స్టార్ హీరో ప్ర‌భాస్‌ను మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిన మూవీ ‘ఛ‌త్ర‌ప‌తి’ని

మెగాస్టార్ రెడీ.. ‘లూసిఫ‌ర్‌’కు డేట్ ఖ‌రారు..!

మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను చిరంజీవి రీమేక్ చేయాల‌ని అనుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పుష్ప’‌.. 

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ 'బాహుబలి' రికార్డులు క్రియేట్‌ చేసిన బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో

యూపీలో ఘోర ప్రమాదం.. భవనం పైకప్పు కూలి 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌ మురాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.