Chandrababu:చంద్రబాబును చెప్పుతో కొడతా.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం..

  • IndiaGlitz, [Monday,December 18 2023]

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిపెట్టాయి. టికెట్ రాదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థుల అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర విజయవంతం చేయడం కోసం ఆనంద్‌బాబు అరకులో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో మావోయిస్టుల చేతిలో హతమైన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అబ్రహం అనుచరులు రెచ్చిపోయారు.

తమ నేత అబ్రహంకు టికెట్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని.. ఆయనకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సైలెంట్‌గా ఉండాలని అరకు పార్లమెంటరీ ఇంచార్జ్ కిడారి శ్రావణ్ వారించినా వినలేదు. ఈ క్రమంలోనే ఓ కార్యకర్త తమను మోసం చేసిన చంద్రబాబును చెప్పుతో కొడతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సొంత పార్టీ నేతలనే చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారని.. దీంతో ఆ పార్టీ కార్యకర్తలే ఆయనపై తిరగబడుతున్నారంటూ వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు.