Chandrababu:చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా

  • IndiaGlitz, [Monday,October 09 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాల వాదనలు జరిగాయి. జీఎస్టీ డీజీ రిపోర్ట్‌ను సీఐడీ కోర్టుకు అందించింది. చంద్రబాబు తరపున సాల్వే, సింఘ్వీ, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, పొన్నవోలు వాదించారు. స్కిల్ స్కాంపై 2021లోనే ఎఫ్‌ఐఆర్ నమోదైందని 2017కు ముందు కేసు నమోదైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని హరీష్ సాల్వే వాదించారు. సెప్టెంబర్ 19న కోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని, సెప్టెంబర్ 20న కొన్ని డాక్యుమెంట్లను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిందని సుప్రీంకోర్టుకు సాల్వే తెలిపారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందు వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 17ఏ ప్రకారం ఓ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు అధీకృత అధికారి అనుమతులు పొందాల్సిందేననని వాదించారు. దీనికి జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పందిస్తూ ఈ కేసులో మీ క్లయింట్‌కు 17ఏ వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిస్తున్నాయని తెలిపారు.

బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను కొట్టివేసిన ఏసీబీ కోర్టు..

అటు ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు ఊరట లభించలేదు. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా చంద్రబాబు తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై గత కొన్ని రోజుల పాటు వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు రెండు పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు..

ఇటు ఏపీ హైకోర్టులోనూ చంద్రబాబుకు తీవ్ర నిరాశే ఎదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో ఆయన దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అంగళ్లు కేసులో అరెస్ట్ అయిన వారికి ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు అయింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న హరిప్రసాద్‌, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణలకు బెయిల్ వచ్చింది. దీంతో చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ లభిస్తుందనే ఆశలో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే చంద్రబాబుకు తప్ప మిగిలిన వారందరికీ బెయిల్ రావడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

More News

KTR:రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. నోటుకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాకీయాలు హీటెక్కాయి. అధికార, ప్రతిపక్షాలు ఎత్తులు పైఎత్తులకు దిగాయి.

Telangana:తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. పాటించాల్సిన నిబంధనలు ఏమిటి..?

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

KCR:కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమా..? కొత్త ప్రభుత్వం వస్తుందా..? తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

కొంతకాలంగా రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. మొత్తానికి తెలంగాణ ఎన్నికలకు సైరెన్ మోగింది.

Yatra 2:యాత్ర 2  : ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ .. సీఎం జగన్ పాత్రపై సస్పెన్స్‌కు చెక్, వైఎస్ఆర్ కొడుకుగా ఆయనే

2019 ఎన్నికల సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi:కొన్ని వార్తలకు కలత చెందా : 'తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర' పుస్తకావిష్కరణలో చిరంజీవి వ్యాఖ్యలు

భారతీయ తొలి సినీ పత్రిక నుంచి నేటి వరకు పనిచేసిన సినీ జర్నలిస్టుల సమాచారం, సినీ విశేషాలతో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన