Chandrababu, Pawan Kalyan: ఎన్నికల బృందంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు.

  • IndiaGlitz, [Tuesday,January 09 2024]

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు నెలల్లోనే పోలింగ్ జరగనుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల ఖరారుతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల బృందం రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో రాజకీయ పార్టీల నేతలతో పాటు ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. ఓట్ల జాబితాలో అవకతవకలు, ఎన్నికల విధులు తదితర అంశాలపై చర్చించనుంది. అలాగే ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించనుంది. ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సోమవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు.

ఇవాళ(మంగళవారం), రేపు(బుధవారం) రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ముందుగా ప్రధాన పార్టీలైన నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి హాజరయ్యారు. అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మార్గాని భరత్‎తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలోని అక్రమాలను ఆయా పార్టీల నేతలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నేతలతో చర్చ అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానున్నారు.

అనంతరం రేపు ఎన్నికల సన్నద్ధతపై సీఈవో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికల విధులకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతారు. రాజకీయ పరిస్థితులు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలో నెలకొన్న ఇబ్బందులు, నమోదు ప్రక్రియకు అవసరమైన సమయంపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. తదుపరి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కేంద్ర ఎన్నికల బృందం పర్యటనతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైందనే చెప్పాలి.

ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి తొలి వారంలో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం ఆరు లేదా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని సీఈసీ అధికారులు భావిస్తున్నారు. ముందుగా తొలి దశలో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు తమిళనాడు లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గత రెండు రోజులు తమిళనాడులో ఎన్నికల అధికారులు పర్యటించారు. మొత్తానికి వచ్చే రెండు, మూడు నెలలు దేశంలో ఎన్నికల కోలాహలం ఉండనుంది.

More News

Maldives: అట్లంటుంది మరి.. ప్రధాని మోదీ దెబ్బకు మాల్దీవులు విలవిల..

'లక్షద్వీప్' ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రధాని మోదీ(PM Modi) లక్షద్వీప్(Lakshadweep) పర్యటనకు వెళ్లిన రోజు నుంచి ఈ పేరు గురించి అన్వేషించే వాళ్లు పెరిగిపోయారు.

TDP: ఇచ్చట పోటీకి అభ్యర్థులు కావలెను.. దారుణ పరిస్థితుల్లో టీడీపీ..

మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. అధికార వైసీపీ మాత్రం ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల ఎంపికలో ముందంజలో ఉంది.

Telangana BJP: లోక్‌సభ ఎన్నికలపై టీబీజేపీ ప్రత్యేక కసరత్తు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు ప్రకటన..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి తహతహలాడుతున్న కమలనాథులు

Bandla Ganesh: హరీష్‌రావు, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్‌ తీవ్ర విమర్శలు

టాలీవుడ్ అగ్ర నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో గణేశ్ మాట్లాడుతూ

Devara:'దేవర' గ్లింప్స్ వచ్చేసిందిగా.. ఎన్టీఆర్ నటన అరాచకం అంతే..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'. ఇప్పటికే విడుదలైన పోసర్లు సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయగా..