చంద్రోదయం చిత్రీకరణ పూర్తి

  • IndiaGlitz, [Saturday,October 27 2018]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం 'చంద్రోదయం'.
ఈ బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వంలొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తి చెసుకుంది. ఇటివలే ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసారు యూనిట్.

ఈ సందర్భంగాదర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. ఆకులు ఎన్ని కాల్చిన బొగ్గులు కావు బ్రదర్ . జిత్తులమారి నక్కలు , తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు , మృగరాజు న అల్లుడే అనే ఎన్టీఆర్ క్యారెక్టర్ డైలాగ్ తో షూటింగ్ విజయవాడ లో పూర్తి అయ్యింది . చంద్రబాబు నాయుడు గారు దేశ చరిత్రలొనె ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు గారి బయోపిక్ ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ పూర్తిచేశాము. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్దాయికి చెరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నామనిన్నారు.

నారా వారి పల్లె, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ లాంటి లొకెషన్స్ లో సినిమా షూటింగ్ చెశాము. మహా నాయకుడి బయోపిక్ ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. పాటలను నవంబర్ 2 వ వారంలొ విడుదల చెస్తాము. సంక్రాంతి కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

More News

టెంపర్‌ రీమేక్‌ చేయడానికి కారణమదే: విశాల్‌

'పందెంకోడి' చిత్రంతో తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల్లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'పందెంకోడి-2'.

ప్ర‌జ‌ల త‌ర‌పున రాజకీయ అస్ర్తం ఆప‌రేష‌న్ 2019

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు  టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్ న‌టిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 9న

ట్రూ సక్సెస్ దిశగా 'టు ఫ్రెండ్స్' 

అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించి, రాయలసీమ ముద్దు బిడ్డగా, అనంతపురం ఆణిముత్యంగా అభివర్ణించబడే బహుముఖ ప్రజ్ఞాశాలి

అదుగో చిత్రానికి రాజేంద్ర‌ప్ర‌సాద్ వాయిస్ ఓవ‌ర్..

అదుగో.. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.

తమ్మారెడ్డి భరద్వాజ్ చేతులమీదుగా 'దమయంతి' మూవీ టీజర్ విడుదల

గురు దత్త క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అంగారిక వియాన్ జీ నిర్మిస్తున్న చిత్రం 'దమయంతి'. నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో